Breaking: విశాఖ ఎయిర్ పోర్ట్ వద్ద జరిగిన ఘటన పై పోలీసులు కేసులు నమోదు చేశారు. విశాఖ విమానాశ్రయం వద్ద వైసీపీ నేతలు, మంత్రుల కార్లపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడినట్లు వైసీపీ నేతలు ఆరోపించారు. వైసీపీ నేతల పిర్యాదు పై జనసేన నేతలు, కార్యకర్తలపై పోలీసులు ఐపీసీ 307 కింద కేసులు నమోదు చేశారు.
వైసీపీ కీలక నేత వైవి సుబ్బారెడ్డి, మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేష్ కార్ల పై ఎయిర్ పోర్ట్ వద్ద దాడి జరిగిన సంగతి తెలిసిందే. విశాఖ పోలీస్ కమీషనర్ ఎయిర్ పోర్ట్ వద్ద సీసీ టీవీ పుటేజ్ పరిశీలించారు. నిందితులను గుర్తించిన పోలీస్ లు వారిని అదుపులోకి తీసుకునేందు పవన్ కళ్యాణ్ బస చేసిన నోవాటెల్ హోటల్ వద్దకు చేసుకున్నారు. పెద్ద ఎత్తున పోలీస్ లు హోటల్ కు చేసుకొని పలువురిని అదుపులోకి తీసుకొనే ప్రయత్నం చేయగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జనసేన నాయకులు సుందరపు విజయ్ కుమార్, పివిఎస్ఎన్ రాజు తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
విశాఖ గర్జనపై జనసేన నేత నాగబాబు వైరల్ కామెంట్స్
జనసేన నాయకులను అరెస్ట్ చేయడంపై పవన్ కళ్యాణ్ తప్పు బట్టారు. తక్షణం అరెస్ట్ చేసిన జనసేన నాయకులు, కార్యకర్తలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఈ ఘటనల నేపథ్యంలో ఆదివారం నిర్వహించ తలపెట్టిన జనసేన జనవాణి కార్యక్రమం సజావుగా జరుగుతుందా లేదా అన్న దానిపై ఉత్కంఠత నెలకొంది.
విశాఖలో మంత్రులు రోజా, జోగి రమేష్ కార్లపై జనసేన కార్యకర్తల దాడి .. జనసేనపై మంత్రులు ఫైర్