Breaking: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురైయ్యారు. పంజాబ్ రాష్ట్రం మొహాలీలోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే వంశీ ఆరోగ్యం నిలకడగానే ఉందనీ, ఆందోళన చెందాల్సిన పని లేదని కుటుంబ సభ్యులకు ఆసుపత్రి వైద్యులు సమాచారం అందించినట్లు సమాచారం. అనారోగ్యం నుండి వంశీ ఒకటి రెండు రోజుల్లో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కానున్నట్లు తెలుస్తొంది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రతిష్టాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (హైదరాబాద్)లో గత ఏడాది వల్లభనేని వంశీ సీటు సాధించారు. ప్రస్తుతం వంశీ అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం ఇన్ పబ్లిక్ పాలసీ (ఎఎంపీపీపీ) కోర్సు చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నుండి పంజాబ్ లోని మొహాలీ క్యాంపస్ నుండి అఫ్ లైన్ క్లాసులకు వంశీ హజరు అవుతున్నారు. ప్రస్తుతం మూడవ సెమిస్టర్ క్లాసులు జరుగుతున్నట్లు సమాచారం. మంగళవారం ఈ క్లాసులకు హజరైన వంశీ చేతికి తీవ్రమైన నొప్పి వచ్చింది. దీంతో ఆయన మొహాలీలోని ఆసుపత్రికి చేరి చికిత్స పొందుతున్నారు. వైద్యులు వంశీకి ఈసీజీ, 2 డీ ఎకో, వంటి పరీక్షలు నిర్వహించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ప్రస్తుతం వంశీ ఆరోగ్యం నిలకడగానే ఉందనీ, ప్రమాదం ఏమీ లేదని వైద్యులు చెప్పినట్లు సమాచారం. వంశీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని తెలియడంతో గన్నవరం ప్రాంతంలో ఆయన అభిమానులు ఆందోళనకు గురైయ్యారు. పలువురు వైసీపీ నేతలు వంశీ ఆరోగ్యంపై వాకబు చేసి పరామర్శించినట్లు తెలుస్తొంది.