Breaking News: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పరిపాలనలో తన దైన మార్కు చూపిస్తున్న విషయం తెలిసిందే. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్న జగన్మోహనరెడ్డి సర్కార్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నది. ఇకపై గ్రూపు 1 రిక్రూట్మెంట్ లో ఇంటర్వ్యూ విధానం రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ప్రభుత్వం 2021-22 కు సంబంధించి జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్యాలెండర్ లో ఏ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారనే సమగ్ర సమాచారాన్ని పొందుపరిచింది. ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన కొద్ది రోజులకే ప్రభుత్వం ఇంటర్వ్యూ విధానం రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నది.
ఏపిపిఎస్సీ నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించి ఇంటర్వ్యూలను రద్దు చేసింది. గ్రూప్ 1 తో సహా అన్ని కేటగిరిలోనూ ఇంటర్వ్యూలు రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. గ్రూపు పరీక్షల్లో పూర్తి పారదర్శకత కోసం ఇంటర్వ్యూ విధానం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఇకపై రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది.
Read more: MAA Polls: ‘మా’పై నాగబాబు చేసిన వ్యాఖ్యలకు నరేశ్ స్పందన ఇది..
ఉద్యోగాల నియామకాల ప్రక్రియ విషయంలో సంపూర్ణ పారదర్శకతతో వ్యవహరించాలని ప్రభుత్వ భావిస్తోంది. ఏపిపిఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షలలో ఇంటర్వ్యూ విధానం తొలగించాలని చాలా కాలం నుండి డిమాండ్ ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలు చర్యలు పట్టించుకోలేదు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. పోటీ పరీక్షల అభ్యర్థులకు ఇది ఒక గుడ్ న్యూస్యే.