Breaking: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీ ని మినీ వ్యాన్ ఢీ కొట్టడంతో ఏడుగురు మృతి చెందగా మరో పది మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. రెంటచింతల వడ్డెర బావి ప్రాంతానికి చెందిన 38మంది వ్యవసాయ కూలీలు మినీ వ్యాన్ లో ఆదివారం శ్రీశైలం వెళ్లారు. వీరు రాత్రి తిరుగు ప్రయాణం అయ్యారు. కొద్ది నిమిషాల్లో ఇళ్లకు చేరుకొనుండగా తెల్లవారు జామున వీరి వాహనం ప్రమాదానికి గురి అయింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రెంటచింతల విద్యుత్ కార్యాలయం వద్ద ఆగి ఉన్న లారీని వ్యాన్ ఢీకొట్టింది.
Breaking: డ్రైవర్ నిర్లక్ష్యంతో..
ఈ ప్రమాదంలో అక్కడి కక్కడే నలుగురు మృతి చెందారు. గాయపడిన మరో 18మందిని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యలో ఒకరు, చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. మొత్తం ఏడుగురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన 11మందికి గురజాల ఆసుపత్రిలో ప్రాధమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్ కి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read more: Amalapuram: అమలాపురం ప్రాంత ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన .. ఎందుకంటే..?
ప్రమాదంలో నారాయణపురం కోటమ్మ (65), పులిపాడు కోటేశ్వరమ్మ (55), మక్కెన వెంకటరమణ (40), కోటమ్మ (70), పెద్దారపు లక్ష్మీనారాయణ (35), కురిచేటి రమాదేవి (50), కానాల పద్మ (40) మృతి చెందినట్లు గుర్తించారు.