Breaking : గుంటూరు పొత్తూరు సిస్టర్ కేర్ కళాశాలలో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. కళాశాలలోని 11 మంది విద్యార్థినులు ఉన్నంటుండి పడిపోయారు. వీరిని కళాశాల యాజమాన్యం హుటాహుటిన గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. పరీక్షలు రాయడం కోసం వచ్చిన విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురి కావడం తీవ్ర సంచలనం సృష్టించింది.
విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై కళాశాల యాజమాన్యం, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వారికి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.