Breaking: ఏపి అసెంబ్లీ నుండి అయిదుగురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. అసెంబ్లీలో జంగారెడ్డిగూడెం కల్తీ సారా మరణాలపై చర్చ జరగాలంటూ టీడీపీ సభ్యులు నేటి సభలో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి కాగితాలు విసిరివేస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. పలు మార్లు స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఆగ్రహం వ్యక్తం చేసినా టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. దీంతో అధికార పక్షం సభను సజావుగా జరగకుండా గందరగోళం సృష్టిస్తున్న టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్న కారణంగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బుచ్చయ్య చౌదరి, బాల వీరాంజనేయులు. పయ్యావుల కేశవ్ లను సభ నుండి సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల చివరి వరకూ వీరిపై సస్పెన్షన్ విధించారు. సభలో టీడీపీ సభ్యులు హుందాగా వ్యవహరించడం లేదని స్పీకర్ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?