Breaking: ఏపిలో రేపు జరగాల్సిన ఇంటర్ పరీక్ష వాయిదా పడింది. ఆసని తీవ్ర తుఫాను దిశ మార్చుకుని రాష్ట్రం వైపు దూసుకువస్తున్న నేపథ్యంలో ఇంటర్ పరీక్ష విషయంలో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రేపు (11వ తేదీ) జరగాల్సిన ఇంటర్ పరీక్షను ఈ నెల 25వ తేదీన జరుపుతామని ఇంటర్ బోర్డు వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆసని తుపాను ఉత్తర కోస్తాంధ్ర – ఒడిశా తీరాలను తాకుతూ పశ్చిమ బెంగాల్ వైపు వెళుతుందని వాతావరణ శాఖ అధికారులు తొలుత అంచనా వేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Breaking: 12వ తేదీ నుండి యథావిధిగా పరీక్షలు
అయితే ఆసని దిశ మార్చుకుని మచిలీపట్నం వైపుకు దూసుకువస్తుందని వాతావరణ శాఖ తెలియజేయడంతో ఏపి ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాను ప్రభావంతో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రేపు జరగాల్సిన ఇంటర్ పరీక్షను వాయిదా వేసినట్లు ఏపి ఇంటర్మీడియట్ విద్యామండలి పరీక్షల నియంత్రణ అధికారి ఒక ప్రకటనలో తెలియజేశారు. పరీక్ష తేదీ మార్పును ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ధినీ విద్యార్ధులు, తల్లిదండ్రులు గమనించాలని కోరారు. పరీక్ష కేంద్రాము, పరీక్ష వేళల్లో ఎలాంటి మార్పు ఉండదని తెలియజేశారు. 12వ తేదీ నుండి జరగవలసిన పరీక్షలు యథావిధిగా ఎలాంటి మార్పులు లేకుండా జరుగుతాయని తెలియజేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?