Breaking News Two Persons Died in Sarpavaram : తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని సర్పవరం వద్ద టైకీ రసాయన పరిశ్రమలో గ్యాస్ లీకై ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా మరో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మాధవపట్నంలోని ఒ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నైట్రిక్ యాసిడ్ ప్రొసెస్ చేస్తున్న సమయంలో గ్యాస్ లీకై బాయిలర్ పేలినట్లు చెబుతున్నారు. బాయిలర్ పేలుడుతో పరిశ్రమలో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో వంద మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. ప్రమాదంతో కార్మికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు.
అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఈ కర్మాగారంలో తరచు ప్రమాదాలు జరుగుతుండటంతో కార్మికులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే మంత్రి కురసాల కన్నబాబు అక్కడకు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని ఆదుకుంటామని మంత్రి కన్నబాబు తెలిపారు. ఘటనపై పూర్తి దర్యాప్తునకు కాలుష్య నివారణ, విపత్తు, పోలీస్ శాఖలను విచారణకు ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. ఘటనా స్థలాన్ని కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?