Breaking : పురపాలక సంఘ ఎన్నికల్లో వైసీపీ హవా స్పష్టంగా కనబడుతోంది. టీడీపీ కాస్తోకూస్తో ఆశపెట్టుకున్న విశాఖ, విజయవాడ, గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ లలోనూ వైసీీపీ అధిక్యత కొనసాగుతోంది. విశాఖపట్నంలో మొత్తం 98 డివిజన్ లకు గానూ ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు 55 డివిజన్ లలో వైసీపీ గెలుచుకోగా టీడీపీ 29, నాలుగు జనసేన, ఆరు ఇతరులు గెలుచుకున్నారు.
విజయవాడ నగర పాలకసంస్థలో 64 డివిజన్ లకు గానూ వైసీపీ 23 డివిజన్ లు గెలుచుకోగా, టీడీపీ పది డివిజన్లు గెలుచుకున్నది,. మిగిలిన డివిజన్లలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తాడిపత్రి, మైదుకూరు మినహా రాష్ట్రంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఏకపక్షంగా వైసీపీకి ఫలితాలు రావడంతో ఆ పార్టీ నేతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?