Brother Anil: వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెట్టము అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో తలదూర్చము అంటున్నారు. కానీ బ్రదర్ అనిల్ పరోక్షంగా తెరవెనుక రాజకీయ వ్యూహాలు వేస్తూనే ఉన్నారు. సీక్రెట్ భేటీలు అవుతూనే ఉన్నారు. తాజాగా ఈ రోజు కూడా ఆయన విశాఖపట్నంలోని ఒక ప్రముఖ హోటల్ లో కొంత మంది క్రీస్టియన్ మత పెద్దలతో భేటీ అయ్యారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని మూడు జిల్లాల నుండి దాదాపు 150 నుండి 200 మంది క్రైస్టియన్ పెద్దలతో సమావేశం అయ్యారు. వాళ్ల సమస్యలు, తమ భవిష్యత్తు ఆలోచనలు, వాళ్ల మనసులో ఏముంది. రాజకీయంగా అవసరమైతే వాళ్లు సపోర్టు చేస్తారా..? లేదా.. వాళ్లు ప్రస్తుతం ఏ పార్టీకి మద్దతుగా ఉన్నారు..? తదితర రాజకీయ విషయాలపైనే చర్చ జరిగి ఉంటుంది. నిజానికి బ్రదర్ అనిల్ తనకు రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం లేదు. తన కార్యక్రమాలు అన్నీ రాజకీయాలకు అతీతం అని రీసెంట్ గా ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆయన చెప్పిన ప్రకారం బ్రదర్ అనిల్ కు రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం లేదనుకున్నా, వైఎస్ షర్మిలకు ఏపి రాజకీయాల్లో తలదూర్చే ఆలోచన లేదని అనుకున్నా ఈ సెక్రెట్ భేటీలు ఎందుకు..?
Brother Anil: తొలుత మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ తో..
నెల రోజుల క్రితం బ్రదర్ అనిల్ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ తో భేటీ అయ్యారు. ఆ తరువాత విజయవాడ తదితర ప్రాంతాల్లో కొన్నివర్గాలతో భేటీ అయ్యారు. ఈ రోజు విశాఖలో మీటింగ్ పెట్టారు. ఆయనకు రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం లేకపోతే ఈ భేటీలు ఎందుకు పెట్టినట్లు..? రాజకీయంగా చైతన్యంగా ఉండే సామాజికవర్గాల పెద్దలతో సమావేశాలు నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటి.?. ఏపి సీఎం వైఎస్ జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య విభేదాలు ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అన్నా చెళ్లెళ్ల మధ్య గ్యాప్ ఉన్న మాట వాస్తవమే. ఆ గ్యాప్ కారణంగానే ఆమె తెలంగాణ వెళ్లి పార్టీ పెట్టుకున్నారు. అయితే ఆమెకు అక్కడ రాజకీయంగా పెద్ద అవకాశం ఉండకపోవచ్చనే మాట వినబడుతోంది. ఆమె చేయించుకున్న సర్వేలలో కూడా ఒకటి రెండు సీట్లు కష్టమే అని చెబుతున్నారుట. ఒక వేళ బ్రదర్ అనిల్ ఏపి లో పార్టీ పెడితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ ని 2009 నుండి చూస్తూనే ఉన్నాము. ఒక్క స్థానంలో కూడా డిపాజిట్లు రాలేదు. ఆయనను కమిడియన్ గా చూస్తున్నారు. ఆయనను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రల్స్ చేస్తుంటారు.
Brother Anil: అన్నను దారిలోకి తెచ్చుకునేందుకే..?
నిజానికి కేఏ పాల్ కొన్ని విషయాలు చాలా సబ్జెట్ గా చెబుతారు. అయితే తనకు తాను పొగడ్తలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆయనను ట్రోల్ చేస్తుంటారు. పరిపాలనా విషయాలపై ఆయన బాగానే మాట్లాడతారు. బ్రదర్ అనిల్ నిజంగా రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెడితే మరో కేఏ పాల్ అవుతారు. ఆయన కమెడియన్ కేఏ పాల్ అయితే ఈయన సీరియస్ కేఏ పాల్ అవుతారు. ఈయన భీభత్సంగా వెయ్యి ఓట్లకు పైగా ఏమీ రావు. మహా అయితే నాలుగైదు నియోజకవర్గాల్లో పోటీ ఇచ్చే స్థాయికి వెళతారు. ఇది బ్రదర్ అనిల్ కు తెలియక కాదు. తెలుసు. అటువంటి విషయాలు తెలిసి రాజకీయ పార్టీగా దిగి డబ్బు ఖర్చు పెట్టుకోవాలని అని అనుకోరు. అన్న చెళ్లెళ్ల మధ్య గ్యాప్ ఉంది కాబట్టి, అన్నను దారిలోకి తెచ్చుకునేందుకు బ్రదర్ అనిల్ తో పార్టీ పెట్టిస్తే వైసీపీకి పడాల్సిన క్రీస్టియన్ ఓట్లు కొన్ని ఇటు చీలతాయి. రాష్ట్రంలో ఎస్సీ నియోజకవర్గాల్లో మాత్రమే కొంత ప్రభావం ఉండవచ్చు. అందుకే బ్రదర్ అనిల్ బావ జగన్ తన మాట వినాలనో, తనకు గుర్తించాలని వ్యూహం సిద్ధం చేసుకున్నారని అనుకోవచ్చు.