brutal murders: ఏపిలోని విజయవాడ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను, ఇద్దరు పిల్లలను అతి దారుణంగా హత్య చేసి పరారు అయినట్లు తెలుస్తోంది. విజయవాడ వాంబే కాలనీలో నివాసం ఉండే ఉల్లి వ్యాపారి మోహన్ బుధవారం రాత్రి భార్య, ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేశాడు మృతులు నీలవేణి, ఝాన్సీ, సాయిగా గుర్తించారు. రక్తపు మడుగులో మృతదేహాలు ఉండటం చూసిన స్థానికులు గురువారం ఉదయం పోలీసులకు సమాచారం అందించారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. పరారీలో ఉన్న భర్త పోలీసులకు దొరికితేనే హత్యకు గల కారణాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్యలు జరిగాయా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. భార్య, పిల్లలను దారుణంగా హత్య చేసిన నిందితుడు కూడా ఎక్కడికైనా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.