Buchaiah chowdary meet chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుతో సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి బేటీ అయ్యారు. టీడీపీలో నెలకొన్న పరిస్థితులపై ఇటీవల బుచ్చయ్యచౌదరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడినట్లు వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో చంద్రబాబు నేరుగా ఫోన్ లో ఆయనతో మాట్లాడారు. అదేవిధంగా టిడిపి నేతలు నిమ్మకాయల చినరాజప్ప, గద్దె రామ్మోహన్ తదితర నేతలను ఆయన వద్ద కు పంపారు. పార్టీలో నెలకొన్న పరిస్థితులపై అధినేతతో మాట్లాడి పరిష్కరించుకుందాం అని నేతలు ఒప్పించడంతో ఆయన చంద్రబాబును కలిసేందుకు గురువారం పార్టీ కార్యాలయానికి వచ్చారు. పార్టీ అంతర్గత విషయాలపై చంద్రబాబుతో సుదీర్ఘంగా బుచ్చయ్య చౌదరి మాట్లాడిన అనంతరం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు.
ఈ జీవితం తెలుగు దేశం పార్టీ కి అంకితం అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈరోజు చంద్రబాబుతో కార్తీ కార్యాలయంలో పార్టీలో జరుగుతున్న అంతర్గత విషయాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని పేర్కొన్నారు.తనకు అండగా నిలిచిన పార్టీ నాయకులు కార్యకర్తలు కోరిక మేరకు తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు గా చెప్పారు. ఈ పరిణామంతో బుచ్చయ్య అలక వీడినట్లు అయ్యింది.