Dhulipalla Narendra: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పై మరో కేసు నమోదు అయ్యింది. కరోనా సమయంలో విధించిన కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించారన్న అభియోగంపై పడమట పోలీసులు కేసు నమోదు చేశారు. కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమించి ఓ హోటల్ లో సమావేశం ఏర్పాటు చేశారన్న ఆరోపణలపై ఐపీసీ సెక్షన్ 188, 269, 270, రెడ్ విత్ 34తో పాటు ఏపిడమిక్ చట్టం కింద కేసు రిజిస్టర్ చేశారు.
Read More: YS Sharmila: కేసిఆర్ సర్కార్ పై మరో సారి వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నోవాటెల్ హోటల్ లో గత నెల 29న ధూళిపాళ్ల 20 మందితో సమావేశం ఏర్పాటు చేసినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ధూళిపాళ్ల నరేంద్రను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సంగం డెయిరీకి సంబంధించి అక్రమాలు జరిగాయనే ఆభియోగంపై చైర్మన్ గా ఉన్న ఆయనను అరెస్టు చేశారు. ఇటీవలే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన రాజమండ్రి జైలు నుండి విడుదల అయ్యారు.