టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై కేసు నమోదు అయ్యింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నిన్న చిత్తూరు జిల్లా కుప్పం నుండి ప్రారంభమైన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం కుప్పంలో జరిగిన సభలో పోలీసులపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. బహిరంగ సభలో అచ్చెన్నాయుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై కుప్పం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ శివకుమార్ కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 153 కింద కేసు నమోదు చేశారు.
మరో పక్క లోకేష్ పాదయాత్ర రెండో రోజు శనివారం ఉదయం కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల నుండి ప్రారంభమైంది. ఇవేళ గుడుపల్లె మండలం బెగ్గిపల్లె గ్రామస్తులతో లోకేష్ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత పార్టీ నేతలతో సమావేశం అవుతారు. ఈ రోజు 9.7 కిలో మీటర్ల పాదయాత్ర చేసి పలమనేరు – కుప్పం హైవే పక్క ఈ రాత్రి బస చేయనున్నారు. లోకేష్ పాదయాత్రలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నారు. కాగా పాదయాత్రకు పోలీసులు అనుమతులు ఇచ్చిన సందర్భంలోనే ప్రైవేటు సెక్యురిటీ ఏర్పాటు చేసుకోవాలని సూచించిన నేపథ్యంలో టీడీపీ నాయకులు 500 మంది పార్టీ వాలంటీర్లను, 200 మంది బౌన్సర్లను నియమించుకున్నారు. మరో పక్క పోలీసులు కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు.
బెంగళూరుకు తారకరత్న తరలింపు ..ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..?