Vijaya Sai Reddy: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రెండు వారాల పాటు విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది. తీర ప్రాంత అభివృద్ధిపై అధ్యయనం చేసేందుకు విదేశాలకు వెళ్లాలని విజయసాయి రెడ్డి సీబీఐ కోర్టును కోరారు. విజయసాయి అభ్యర్థనపై అక్టోబర్ లోగా రెండు వారాల పాటు విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది. అయిదు లక్షల చొప్పున ఇద్దరి పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. దుబాయ్, బాలి, మాల్దీవులకు విజయసాయి వెళ్లనున్నారు.
జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయి రెడ్డి ఏ 2 నిందితుడుగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్ పై ఉన్నారు. బెయిల్ షరతుల ప్రకారం విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కారణంగా విజయసాయి కోర్టు అనుమతి కోరగా మంజూరు చేసింది.