YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (వివేకా) హత్య కేసును ఏపి బయట విచారణ జరిగేలా ఆదేశాలు జారీ చేయాలని వివేకా కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు .. ఏపి ప్రభుత్వం, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణ బుధవారం జరగనున్న నేపథ్యంలో మంగళవారం సుప్రీం కోర్టులో సీబీఐ తమ అఫిడవిట్ దాఖలు చేసింది. వివేకా కుమార్తె లేవనెత్తిన అనుమానాలకు బలం చేకూరేలా సీబీఐ సంచలన విషయాలను అఫిడవిట్ లో ప్రస్తావించింది.
వివేకా హత్య కేసును ఏపి బయట విచారించాలని దాఖలు చేసిన పిటిషన్ లో సునీతా రెడ్డి చెప్పిన విషయాలు అన్నీ వాస్తవాలేనని సీబీఐ తమ కౌంటర్ లో స్పష్టం చేసింది. కేసు విచారణ అధికారిపైనే నిందితులు కేసులు పెట్టారని తెలిపింది. మెజిస్ట్రేట్ ముందు 164 స్టేట్ మెంట్ ఇస్తానన్న పోలీస్ అధికారి శంకరయ్య కు ఏపి ప్రభుత్వం పదోన్నతి కల్పించారని సీబీఐ పేర్కొంది. ప్రమోషన్ వచ్చిన తర్వాత తనపై సీబీఐ ఒత్తిడి తెచ్చి 164 స్టేట్ మెంట్ అడిగారంటూ శంకరయ్య లేఖ రాశారని సీబీఐ తెలిపింది. ఏపి పోలీసులు నిందితులతో కుమ్మక్కు అయ్యారనీ, ఆ కారణంగానే దర్యాప్తులో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలిపింది. సునీతారెడ్డి వాదనలు అన్నింటినీ సీబీఐ సమర్ధించింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏవిధమైన వాదనలు వినిపిస్తుంది. సుప్రీం కోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
వివేకా హత్య కేసులో సీబీఐ కీలక ఆరోపణలు.. నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి నోటీసు జారీ చేసిన సుప్రీం కోర్టు
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?