Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ మళ్లీ ప్రారంభమైంది. గత కొద్ది రోజులుగా సైలెంట్ అయిపోయిన సీబీఐ అధికారులు మళ్లీ విచారణను ప్రారంబించారు. సీబీఐ అధికారులపైనే ఆరోపణలు చేయడం, అధికారిపై కేసు నమోదు చేయడం, సీబీఐ అధికారుల కారు డ్రైవర్ ను బెదిరించడం వంటి సంఘటనల నేపథ్యంలో గత కొంత కాలంగా సీబీఐ విచారణ నిలిచిపోయింది. తాజాగా పులివెందుల ఆర్ అండ్ బీ అతిధి గృహంలో అనుమానితులను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Viveka Murder Case: ఇనయతుల్లాను ప్రశ్నిస్తున్న సీబీఐ
వివేకా ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేసిన ఇనయతుల్లాను అధికారులు విచారణ చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా ఇనయతుల్లాను సీబీఐ అధికారులు పలు మార్లు విచారించారు. వివేకా హత్య జరిగిన రోజు ఆయన బెడ్ రూమ్ తో పాటు, బాత్ రూమ్ లో పడి ఉన్న మృతదేహాన్ని ఇనయతుల్లానే తన సెల్ ఫోన్ ద్వారా ఫోటోలు, వీడియోలు తీశారు. ఇనయతుల్లా నుండి కీలక సమాచారాన్ని రాబట్టేందుకు సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
మరో పక్క వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన డ్రైవర్ దస్తగిరి..వైసీపీ నేతలపై ఆరోపణలు చేస్తున్నాడు. కేసులో అప్రూవర్ గా మారినందున తనను అంతం చేయడానికి పులివెందులకు చెందిన వైసీపీ నాయకులు కుట్ర చేస్తున్నారని దస్తగిరి ఆరోపించారు. తాండూరు మండలానికి చెందిన పెద్ద గోపాల్ అనే వ్యక్తి గత కొద్ది రోజుల నుండి తనతో, తన కుటుంబ సభ్యులతో గొడవ పడుతూ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పారు.
తన సోదరుడు మస్తాన్ తో గొడవ పడి తనను ఇష్టానుసారంగా తిట్టడంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లాననీ, పోలీసుల ఎదురుగానే తనను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటంతో తాను అతనిపై చేయి చేసుకున్నానని దస్తగిరి తెలిపారు. దీన్ని కారణంగా చూపి పోలీసులు తనపై కేసు నమోదు చేశారన్నారు. తనపై జరుగుతున్న కుట్ర విషయాలను సీబీఐ అధికారి రాంసింగ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు దస్తగిరి. తన ప్రాణాలకు ఏదైనా హాని జరిగితే వైసీపీ నేతలదే బాధ్యత అని దస్తగిరి అంటున్నాడు