ఆంధ్రప్రదేశ్ లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తూర్పు గోదావరి జిల్లా కేపి పురంలో బల్క్ డ్రగ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆమోదం తెలుపుతూ కేంద్రం నుండి ఏపి సర్కార్ కు లేఖ వచ్చింది. ఈ బల్క్ డ్రగ్ పార్క్ కొరకు ఏపితో పాటు తెలంగాణ, కర్ణాకట, తమిళనాడు రాష్ట్రాలు పొటీపడగా, కేంద్రం ఏపికి మంజూరు చేసింది. మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ జాయింట్ సెక్రట్రరీ డాక్టర్ ఎన్ యువరాజ్ ఈ మేరకు ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మకు లేఖ రాశారు.
2020 ఆగస్టు నెలలోనే జగన్ సర్కార్ బల్క్ డ్రగ్ పార్క్ ఎర్పాటునకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీఐఐసీ కేంద్రానికి ధరఖాస్తు చేసింది. 2వేల ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటునటు అప్పట్లో కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ క్రమంలోనే ఏపీఐఐసీ కి అనుబంధంగా ఏపి బల్క్ డ్రగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ (ఏపీబీడీఐసీ) ఏర్పాటు చేసింది. తూర్పు గోదావరి జిల్లాలో ఏర్పాటు కానున్న బల్క్ డ్రగ్ పార్క్ ద్వారా రానున్న ఎనిమిదేళ్ల లో రూ.46,400 కోట్లు అమ్మకాలు జరుగుతాయనీ, దాదాపు రూ.6940 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?