NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

Free Ration Distribution: కేంద్ర ప్రభుత్వ ఉచిత రేషన్‌ ఇక లేనట్లే..? కేంద్ర మంత్రుల ప్రకటనలు నీటి మీద రాతలేనా..!?

Free Ration Distribution: ఉచిత రేషన్ స్కీమ్‌ను మరి కొంత కాలం పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా అందుకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల కాలేదు. కరోనా నేపథ్యంలో రేషన్ కార్డుదారులకు గత నెల (నవంబర్) వరకూ రేషన్ షాపుల ద్వారా ఉచిత బియ్యాన్ని పంపిణీ చేశారు. అయితే ఈ ఉచిత రేషన్ ను మార్చి 2022 వరకూ పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ గత నెలలో వెల్లడించారు. అయితే డిసెంబర్ కోటా పంపిణీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి ఇంత వరకూ ఎటువంటి ఉత్తర్వులు వెలువడలేదు. పీఎంజీకేఏవై పొడిగించిన అయిదవ విడత అలకేషన్ ఉత్తర్వులు రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సందిగ్ధంలో ఉంది. ఈ నెలలో పీఎంజీకేఏవై బియ్యం పంపిణీ ఉందా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.

 

Read More: YSRCP: పార్లమెంట్ వేదికగా కథ చెప్పి.. జగన్ సలహాదారుల గాలి భలే తీశారుగా ఎంపి మిథున్ రెడ్డి..!!

Free Ration Distribution: పీఏంజీకేవై రేషన్ లేనట్లే..?

ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ ను డోర్ డెలివరీ వాహనాల ద్వారా ఒకటవ తేదీ నుండి 16,17 తేదీ వరకూ పంపిణీ జరుగుతుంది. 18,19 తేదీల నుండి ప్రధాన మంత్రి ఉచిత బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా నేరుగా కార్డుదారులకు పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే 16వ తేదీ వచ్చినా ఇంత వరకూ కేంద్ర ప్రభుత్వం నుండి పీఏంజీకేవై రేషన్ కు సంబంధించి ఉత్తర్వులు రాకపోవడంతో పంపిణీ లేనట్లుగానే భావిస్తున్నారు. ఎందుకంటే గత ఏడాది నవంబర్ నెలలో కూడా ఇదే మాదిరిగా అప్పటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మార్చి 2021వరకూ ఉచిత రేషన్ పొడిగించినట్లు ప్రకటించారు. కానీ డిసెంబర్ 2020 నుండి మార్చి 2021 వరకూ ఆయన చెప్పిన విధంగా ఉచిత రేషన్ పంపిణీ జరగలేదు. ఇప్పుడు కూడా కేంద్ర మంత్రి ప్రకటించారు కానీ అందుకు సంబంధించిన ఉత్తర్వులు రాష్ట్రానికి వచ్చినట్లు లేదు. సో..కేంద్ర మంత్రుల మాటలు నీటి మీద రాతలే అనుకోవాల్సి వస్తుంది ప్రజలు.

కేంద్ర ప్రభుత్వం గత ఏడాది కరోనా నేపథ్యంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన పథకాన్ని (పీఎంజీకేఏవై) తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఉచిత రేషన్ అందించడం ప్రారంభించారు. తొలి సారిగా ఈ స్కీమ్ ను 2020 ఏప్రిల్ నుండి జూన్ వరకూ అమలు చేశారు. తర్వాత దీన్ని 2020 నవంబర్ వరకూ పొడిగించారు. అప్పుడు బియ్యంతో పాటు శనగలు, కందిపప్పు ఉచితంగా పంపిణీ చేశారు. అదే నెలలో 2021 మార్చి వరకూ ఈ పథకాన్ని పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది కానీ పంపిణీ మాత్రం జరగలేదు. మరల ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ వచ్చిన నేపథ్యంలో ఉచిత బియ్యం పథకాన్ని మరో సారి పునరుద్దరించారు. ఈ ఏడాది మే నెల నుండి నవంబర్ వరకూ పిఎంజీకేఏవై బియ్యం పంపిణీ జరిగింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju