Central Minister Bharati Pawar: గుంటూరు మంగళగిరి ఎయిమ్స్ లో జూలై నుండి పీజీ మెడికల్ కోర్సులు ప్రారంభమవుతాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి భారతీ పవార్ తెలిపారు. కేంద్ర మంత్రి డాక్టర్ భారతీ పవార్ గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో పర్యటించారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి భారతీ పవార్ రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సదుపాయాలను పరిశీలించారు. ఆసుపత్రిలో రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు మాట్లాడే ఇంగ్లీషు, హిందీ తమకు అర్ధం కావడంలేదని, తాము చెప్పేది డాక్టర్ లకు అర్ధం కావడం లేదని పలువురు సమస్యను కేంద్ర మంత్రికి వివరించారు. కాగా ఆసుపత్రి ఆవరణలో ఎక్కడా ఆయుష్మాన్ భారత్ గురించి డిస్ప్లే బోర్డు కనిపించకపోవడంపై ఎయిమ్స్ సూపర్నిటెండంట్ డాక్టర్ ముఖేష్ త్రిపాఠీని కేంద్ర మంత్రి నిలదీశారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ సందర్భంలో కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి ఆసుపత్రి మంగళిరి ఎయిమ్స్ అని అన్నారు. రానున్న కాలంలో ఈ ఆసుపత్రి మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ ఆసుపత్రిలో రోజుకు సరాసరి 1500 నుండి 1700 మంది వైద్యసేవల కోసం వస్తున్నారని చెప్పారు. కేంద్ర మంత్రి తన పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలోని జి కొండూరు, మైలవరం ప్రాంతాల్లో పర్యటించి విజయవాడలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఆయుష్మాన్ భారత్ కింద రూ.5లక్షల వరకు ఆరోగ్య భీమా కల్పిస్తున్నామని పేర్కొన్న కేంద్ర మంత్రి .. ఇక్కడ ఎలా అమలు జరుగుతోందని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ నివాస్ ను ప్రశ్నించారు. అక్కడే ఉన్న కొంత మంది బీజేపీ నేతలు రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ అమలు చేస్తున్నారని తెలియజేయగా, ఆరోగ్య శ్రీ కార్డులను అడిగి తీసుకుని పరిశీలించారు. ఈ కార్డులపై ప్రధాన మంత్రి చిత్రం లేకపోవడంపై ప్రశ్నించారు. దీనిపై ప్రధాని మోడీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అదే విధంగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కేంద్ర మంత్రి భారతీ పవార్ సమీక్ష నిర్వహించారు. ఏపి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజని ఏపిలో అందుతున్న వైద్య ఆరోగ్య సేవలను వివరించారు. వైద్య రంగానికి కేంద్రం ఇస్తున్న నిధుల వినియోగంపైనా చర్చించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?