Chandarababu : తెలుగుదేశం పార్టీ అధినేత , ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఊహించని విమర్శ ఇది. చెప్పాలంటే ఆయనకు కామెంట్లలో ఇది పీక్స్ అనుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్లు చేశారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంతో పాటు.. వకీల్ సాబ్ సినిమా ఈవెంట్లోనూ ఏపీ ప్రభుత్వాన్ని, వైసీపీని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టార్గెట్ చేయడంపై స్పందిస్తూ, పవన్ కల్యాణ్ మాటలు.. సినిమా సినిమాకు మారే డైలాగుల్లా ఉన్నాయని కామెంట్ చేశారు.
Chandarababu చంద్రబాబు అలా చనిపోయారట…
అవకాశం దొరికినప్పుడల్లా వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై సజ్జల ఘాటు వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ పగలు ఒకరితో, రాత్రి ఇంకొకరితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందని ఆరోపించిన ఆయన చంద్రబాబు రాజకీయంగా చనిపోయారు అంటూ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లు సహజంగానే వివాదాస్పదంగా మారాయి. దీనిపై టీడీపీ విరుచుకపడుతోంది.
బీజేపీ గురించి ఏమంటున్నారంటే..
భారతీయ జనతా పార్టీ ఇతర ప్రాంతాల నుంచి నాయకులను దిగుమతి చేసుకుని ప్రచారం చేస్తోందని సజ్జల ఆరోపించారు. చేతనైతే ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షాలు ఎత్తి చూపగలగాలి.. కానీ, ఇలాంటి వ్యాఖ్యలు ఏంటి? అంటూ ప్రతిపక్షాలను నిలదీశారు. కరోనా కష్టకాలంలో కూడా సమర్ధవంతంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని సీఎం వైఎస్ జగన్ ముందుకు తీసుకెళ్తున్నారన్న ఆయన.. అందుకే చెప్పటానికి ఏమీ లేక… టీడీపీ, జనసేన, బీజేపీ విష ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు.