Chandra Babu : ఏపీలో జరిగిన పంచాయతీ ఎన్నికలు రాజకీయ విశ్లేషకులను సైతం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ తమదే పై చేయి అని ప్రకటించుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా అధికార వైసీపీ , ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య ఈ వాగ్యుద్ధం జరుగుతోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే, తమ పార్టీకి ఓ రేంజ్లో ఆదరణ దక్కిందని చెప్తున్నారు. టీడీపీకి మంచి ఓట్లు లభించాయని.. దీనికి రాష్ట్ర ప్రజలు అందరికీ అభినందనలు తెలిపారు. వైసీపీ పతనం ప్రారంభమైందని చెప్పిన చంద్రబాబు ఆ పతనాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు అని జోస్యం చెప్పారు. అయితే, దీనిపై ఓ రేంజ్లో ట్రోలింగ్ జరుగుతోంది.
Chandra Babu చంద్రబాబు ఏమంటున్నారంటే..
నాలుగు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వీరోచితంగా పోరాడి 41.7 శాతం స్థానాల్లో గెలిచామని తెలిపిని టీడీపీ అధినేత చంద్రబాబు ఇది ప్రజలు చూపిన చొరవ అని అన్నారు. ఎన్నికలు సక్రమంగా జరిగి ఉంటే ఇంకో 10 శాతం ఓట్లు పెరిగేవన్న చంద్రబాబు.. ఆ 10 శాతం పెరిగి ఉంటే పతనం ఇప్పుడే ప్రారంభం అయ్యేదన్నారు. వైసీపీ దుర్వినియోగంపై ఆధారపడిందని చంద్రబాబు ఆరోపించారు. ఏకగ్రీవం అన్నారు విఫలం అయ్యారు.. ఇక, చేసేది లేక చీకటి రాజకీయాలకు తెరలేపారన్న ఆయన `నేను సీఎంను సూటిగా అడుగుతున్నాను.. కొన్నిచోట్ల మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏమయ్యారు.. ఇదే, ప్రజల తిరుగుబాటు` అని అన్నారు.
ఐయామ్ ది ఫైర్….
20 ఏళ్లు సీఎంగా ఉన్నాను, 12 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న నాకే చెప్తారా? అంటూ చంద్రబాబు మండిపడ్డారు. `ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పారు.. కానీ, సీఎం ఇప్పుడు చేస్తుంది ఏంటి? నన్ను భయపెట్టాలి అని చూస్తున్నారు… కానీ, నేను భయపడను.. తీవ్రవాదులకు, ముఠా సభ్యులకు, మత విద్వేష శక్తులకు నేను భయపడలేదు.. మీకు ఎందుకు భయపడతాను.. ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. కాగా, చంద్రబాబు క్లెయిం చేసుకుంటున్న సీట్లు , ఓట్ల శాతంపై సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రోలింగ్ జరుగుతోంది. నాలగు దశలుగా జరిగిన ఎన్నికల్లో టీడీపీకి షాకిచ్చినా చంద్రబాబు మాత్రం తమదే పైచేయి అని చెప్పుకొంటున్నారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.