Chandra babu: తెలంగాణ ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సన్నిహిత నేత ఒకరు అడ్డంగా దొరికిపోయారని పలువురు అంటున్నారు. కరోనా కట్టడి కోసం ఓవైపు ప్రభుత్వం లాక్ డౌన్ విధించగా.. మరోవైపు కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలు మాత్రం యథేచ్చగా క్లాసులు నిర్వహిస్తున్నాయి. నిబంధనలు లైట్ తీసుకొని కరోనా భయం లేకుండా క్లాసులు నిర్వహిస్తూ పిల్లల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. అటువంటి కాలేజీల్లో నారాయణ కాలేజీ ఉంది.
రూల్స్ ఒకటి…జరుగుతుంది ఒకటి…
కరోనా విజృంభణ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంది. అయితే కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలు ఇవేమీ పట్టన్నట్టు యథేచ్చగా క్లాసులు నిర్వహిస్తున్నాయి. విద్యార్థుల జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా క్లాసులు నిర్వహిస్తున్న కాలేజీల ఉదంతం గురించి పలు మీడియాల్లో వార్తలు వచ్చాయి. ఈ కథనాలు కలకలం రేకెత్తించాయి. దీంతో అలర్ట్ అయిన ఆయా విద్యాసంస్థలు విద్యార్థులను తరగతి గదుల నుంచి పంపించి వేశాయి. ఇందులో నారాయణ కాలేజీ సైతం ఉందని పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
ఇప్పటికే తెలంగాణ సర్కారు సీరియస్
ఇదిలాఉండగా, ఇప్పటికే తెలంగాణలో లాక్డౌన్ మరింత పక్కాగా అమలు చేయడంపై డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్డౌన్పై జిల్లాల వారీగా సీఎం కేసీఆర్ రోజూ సమీక్షిస్తున్నారని పేర్కొన్న డీజీ లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయాలని సీపీ, ఐజీ, ఎస్పీలకు స్పష్టం చేశారు. డీజీపీ ఆదేశాల నేపథ్యంలో పోలీసులు మరింత పక్కాగా నిబంధనలు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.