Chandra Babu : ఏపిలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి కొనసాగుతోంది. నాలుగు దశల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటికి రెండు దశలు పూర్తి అయ్యాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతున్నా ప్రధాన రాజకీయ పక్షాలైన వైసీపీ, టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తమ పార్టీ మద్దతు దారులను గెలిపించుకుని హవా చాటుకునే ప్రయత్నం ఆయా పార్టీలు చేస్తున్నాయి. ప్రధానంగా వైసీపీ.. టీడీపీని తిరుగులేని దెబ్బతీయడానికి వ్యూహత్మకంగా పావులు కదుపుతోంది. అందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంపై దృష్టి సారించింది.
చంద్రబాబు జన్మస్థలం చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని నారావారిపల్లె. ఆ నియోజకవర్గం నుండి 1978లో ఇందిరా కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు మంత్రిగానూ పని చేశారు. చంద్రబాబు మంత్రిగా ఉన్న సమయంలోనే ఎన్టీఆర్ కుమార్తెతో వివాహం జరిగింది. ఆ తరువాత ఎన్ టీ ఆర్ తెలుగుగదేశం ప్రభంజనంలో చంద్రబాబు ఓటిపోవడంతో టీడీపీలో చేరి 1989 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో విజయం సాధించారు. ఆ తరువాత రాష్ట్ర నేతగా గుర్తింపు పొందారు. 1994లో మళ్లీ కుప్పం నుండి గెలిచి 1995లో ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత 1999, 2004, 2009 వరకూ కుప్పం నియోజకవర్గ ప్రజలు చంద్రబాబును ఆదరిస్తూనే వచ్చారు,.
అయితే 2014 నుండి ఆ నియోజకవర్గంలో చంద్రబాబు మెజార్టీ తగ్గుతూ వచ్చింది. 2019 ఎన్నికల్లో 30వేలకు పడిపోయింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. ఇప్పుడు గ్రామ స్థాయిలోనూ వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించడంతో చంద్రబాబుకు కలవరం రేపుతోంది. ఇప్పటి వరకూ చిత్తూరు జిల్లాలో మొదటి, రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వైసీపీ కైవశం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలోని గ్రామాల్లోనూ వైసీపీ సత్తా చాటి చంద్రబాబు, టీడీపీకి గట్టి షాక్ ఇచ్చే ఆలోచనలో వైసీపీ ఉంది. ఇదే గనుక జరిగితే ఎమ్మెల్యే చంద్రబాబు అయినప్పటికీ అధారిటీ మొత్తం జగన్ దేనని అంటున్నారు. ఇది చరిత్రలో మిగిలిపోనున్నది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?