NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Chandra Babu: ‘చెడగొట్టకుండా ఉంటే చాలు అద్భుతరీతిలో అమరావతి అభివృద్ధి చెందుతుంది’

Chandra Babu: “రాష్ట్రంలో ఎక్కడనుండి చూసినా మధ్యలో ఉండే ప్రదేశం అమరావతి, ఎక్కడి నుండైనా సులభంగా చేరుకోగలిగే ప్రాంతం, నువ్వు ఇంట్లో కూర్చున్నా సరే, అమరావతిని చెడగొట్టకుండా, ద్వంసం చేయకుండా ఉంటే చాలు అమరావతి అద్భుత రీతిలో అభివృద్ధి చెందుతుంది” అని సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు హితవు పలికారు మహా పాదయాత్ర ముగించిన అమరావతి రైతులు తిరుపతిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్య అతిధిగా పాల్గొన్న చంద్రబాబు .. జైే అమరావతి, జైజై అమరావతి అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. 45 రోజుల పాటు 450 కిలో మీటర్లు కాలినడకన రైతులు పాదయాత్ర చేశారన్నారు. పాదయాత్రలో వంద కేసులు పెట్టారని ఆరోపించారు. ఈ రైతులు చేసిన పాపం ఏమిటి వారిపై అక్రమ కేసులు పెట్టిన దద్దమ్మ ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు. అప్పుడు అమరావతిని రాజధానిగా నిర్ణయించి భూములు ఇవ్వాలని రైతులను కోరితే వారు వెంటనే స్పందించారని అన్నారు. తన వద్ద నిధులు లేకపోయినా హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన అనుభవం ఉందని చెప్పాననీ, రైతులు ముందుకొచ్చి భూములను త్యాగం చేశారని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు కూడా ఈ రోజు సభావేదికపై ఉన్నారని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అమరావతి రాజధానికి మద్దతు ప్రకటించారని గుర్తు చేశారు. సీపీఐ నారాయణ, రామకృష్ణ మొదటి నుండి అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటిస్తున్నారని అన్నారు.

Chandra Babu: మాట తప్పారా లేదా మడమ తిప్పారా లేదా

“జగన్మోహనరెడ్డి గారూ మీరు ఎన్నికల ముందు ఏమని చెప్పారు. నాడు అసెంబ్లీలో ఏం చెప్పారు. అమరావతి రాజధానిగా పెట్టాలని మీరు చెప్పలేదా, మనకు 13 జిల్లాలే ఉన్నాయనీ, చిన్న రాష్ట్రం అయ్యిందనీ, ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్డడం తనకు ఇష్టం లేదనీ, అయితే కనీసం రాజధానికి 30 వేల ఎకరాలన్నా ఉండాలని అనాడు మీరు చెప్పలేదా, అప్పుడు 33 వేల ఎకరాలు రైతులు ఇచ్చారు. మడమ తిప్పను, మాట తప్పను అనే జగన్ రెడ్డిని ఇప్పుడు అడుగుతున్నా అమరావతిపై మాట తప్పారా లేదా మడమ తిప్పారా లేదా” అని ప్రశ్నించారు. అమరావతిపై కుల ముద్ర వేసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు సభకు అన్ని పార్టీల వారు వీరంతా ఏ కులం వాళ్లు అని ప్రశ్నించారు. వీరంతా ప్రజల మనోభావాలను అర్ధం చేసుకుని అమరావతి రాజధాని కావాలని కోరుతున్నారని అన్నారు. అయిదు కోట్ల మందికి చెందిన ప్రజా రాజధాని అమరావతి. ఇది ఏ ఒక్కరిదో, జగన్ రెడ్డిదో కాదు, ప్రజలు కోరుకున్న రాజధాని అని అన్నారు. అమరావతి ముంపు ప్రాంతం అని ప్రచారం చేశారు., ఈ మూడేళ్లలో ఒక్కసారి అయినా మునిగిపోయిందా అని ప్రశ్నించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అని ఆరోపణలు చేశారు అదేమీ లేదని హైకోర్టు, సుప్రీం కోర్టులు చెప్పాయన్నారు. ఎన్ని కేసులు పెట్టుకున్నా ధర్మపోరాటంలో గెలిచేది అమరావతి ప్రజలేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని నినదించిన చంద్రబాబు అభివృద్ధి అన్ని ప్రాంతాల్లోనూ జరగాలి, రాజధాని మాత్రం అమరావతి మాత్రమే ఉండాలని చంద్రబాబు పునరుగ్ధాటించారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఈ రోజు అన్ని పార్టీలు అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటుంటే జగన్ ఎందుకు మొండిగా వ్యవహరిస్తున్నారు. ఎవరి దమ్ము చూసుకుని ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. అమరావతి రాజధానికి ఏపి బీజేపి నేతలు కూడా మద్దతు ఇస్తున్నారన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెబితే కాదనే దమ్ము జగన్మోహనరెడ్డికి ఉందా వాళ్ల మాట శిరసావహిస్తారు కాబట్టి జగన్ కు వారే చెప్పాలని అన్నారు. ఏపిలో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు, ప్రకాశం జిల్లా వంటి పలు ప్రాంతాలు ఇంకా వెనుకబడి ఉన్నాయనీ, ముందు వాటిని అభివృద్ధి చేయాలని జగన్ కు సూచించారు.

ఏపి బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి దోచుకునేందుకు ఏమీ లేదనే అమరావతిని వద్దంటున్నారని విమర్శించారు. రాజధాని పేరుతో దోచుకుంటారని విశాఖ ప్రజలు వణుకుతున్నారని అన్నారు. అమరావతిలో అనేక ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇచ్చిందన్నారు. అమరావతే ఏపికి రాజధానిగా ఉంటుందని ఎంపి రఘురామ కృష్ణంరాజు అన్నారు. రాజధాని రైతులు ధైర్యంగా పోరాడాలనీ, అంతిమ విజయం రాజధాని రైతులదే అవుతుందన్నారు. సినీనటుడు శివాజీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులశిరెడ్డి, అమరావతి పరిరక్షణ సమితి నేతలు, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి, జనసేన నేత హరిప్రసాద్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. సభా ప్రాంగణం జై అమరావతి, జైజై అమరావతి నినాదాలతో మారుమోగింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju