Chandra Babu: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు మరో మారు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందు ఆయనను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. కాగా టీడీపీ పిలుపు మేరకు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై రెండు రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. ఇదే క్రమంలో చింతమనేని ఆధ్వర్యంలో కూడా దెందులూరులో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితేఈ సమయంలో పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో చింతమనేని పోలీసు విధులకు ఆటంకం కల్గించారన్న అభియోగంపై చింతమనేని మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును పురస్కరించుకుని నిన్న చింతమనేని పోలీసులు విశాఖ సమీపంలో ఓ వివాహ వేడుకకు వెళ్లిన సమయంలో పోలీసులు అరెస్టు చేశారు.
చింతమనేని అరెస్టును టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ విషయంపై ఏపి డీజీపీ గౌతమ్ సవాంగ్ క లేఖ రాశారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతమనేని ప్రభాకర్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ..పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై నిరసన తెలియజేయడం నేరమా అని ప్రశ్నించారు. ఏపిలో ఆటవిక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహస్యం అవుతోందని విమర్శించారు. వైసీపీ ప్రేరేపిత పోలీసు రాజ్యం ఏపిలో కొనసాగుతోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రజలతో పాటు ప్రతిపక్ష నేతలను పోలీసు విభాగం వేధిస్తోందని, ప్రజా స్వామ్య హక్కులకు విరుద్ధంగా పోలీసుల చర్యలు ఉన్నాయని చంద్రబాబు ఆరోపించారు.
Read More..
Mother tortured son: మాతృత్వానికి మాయని మచ్చ.. ఈ కన్న తల్లి కిరాతకత్వం..
AP Capital: ఏపి రాజధాని అంశంపై కేంద్రం క్లారిటీ ఇదీ..!!
CM Stalin: దేశానికి ఆదర్శంగా మారుతున్న స్టాలిన్..! సంచలన సాహస అడుగులు..!!