Chandrababu : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు , ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్లు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. కీలకమైన సమయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చేతులు ఎత్తేశారని అంటున్నారు. ఇదంతా ఏపీలో ప్రాదేశిక ఎన్నికలకు దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో జరుగుతున్న చర్చ. త్వరలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించడం హాట్ టాపిక్గా మారింది.
మేడం కు ముందే చెప్పేశారు…..
జెడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికల విషయంలో గత ఏడాది మధ్యలో ఆగిన ప్రక్రియను కొనసాగించాలన్న ప్రతిపాదనను టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు కొత్త ఎస్ఈసీ నీలం సాహ్నీని కలిసి.. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కోరింది. గతంలో నిమ్మగడ్డ ఉన్నప్పుడే అధికార పార్టీ అరాచకాలకు పాల్పడిందని.. రానున్న ఎన్నికలు కూడా ఏకపక్షంగానే జరుగుతాయని టీడీపీ విమర్శిస్తోంది. గతంలో ఎక్కడైతే ఎన్నికల ప్రక్రియ ఆగిపోయిందో.. అక్కడి నుంచే ఎన్నిలకు వెళ్లాలని ఎస్ఈసీ భావిస్తుండగా.. కొత్త ఎస్ఈసీ నీలం సాహ్నిని కలిసిన టీడీపీ నేత వర్ల రామయ్య.. పరిషత్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు.
టీడీపీ వాదన ఏంటి?
గతంలో పరిషత్ ఎన్నికల ప్రక్రియలో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందంటూ వర్ల రామయ్య ఆరోపించారు. ఎంపీటీసీల్లో గతంలో 2 శాతం ఉన్న ఏకగ్రీవాలు ఇప్పుడు 24 శాతానికి చేరాయన్న ఆయన ఇక, జెడ్పీటీసీలు గతంలో 0.9 శాతం ఏకగ్రీవాలు ఉంటే ఇప్పుడు అది 19 శాతానికి చేరాయని అన్నారు. దీంతో.. మళ్లీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.. కొత్త నోటిఫికేషన్ ఇవ్వకుండా పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తే.. అది మరో డ్రామాగా మారినట్టేనని వర్ల రామయ్య విమర్శించారు.