Chandrababu : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు , ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఘోర అవమానం అంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థులు కామెంట్లు చేస్తున్నారు. సహజంగానే ఉప ఎన్నికల్లో అధికార పార్టీకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ఫలితాల కంటే ముందే చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ తగిలిందని ఆయన వ్యతిరేకుల వాదన. ఇదంతా తెలంగాణలో జరిగిన టీడీఎల్పీ విలీనం ఎపిసోడ్ గురించి.
ఆ ఇద్దరూ…
తెలుగుదేశం పార్టీకి చెందిన తెలంగాణ ఎమ్మెల్యేలు మచ్చా నాగేశ్వరరావు, సండ్ర వెంకట వీరయ్య తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి టీఆర్ఎస్ఎల్పీలో టీడీఎల్పీని విలీనం చేస్తున్నట్టు స్పీకర్కు లేఖ ఇచ్చారు. దీంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది… టీఆర్ఎస్లో టీడీఎల్పీ విలీనం అయ్యింది. ఈ సందర్భంగా ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కండువాలు ధరించి కనిపించారు. ఈ మేరకు వారికి టీఆర్ఎస్ సభ్యుల వరుసలో సీట్లు కేటాయించనున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు.
ఆయన మొదటి నుంచి…
టీడీపీ తరఫున గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కొన్ని రోజుల తర్వాత నుంచే ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అధికార టీఆర్ఎస్ పార్టీకి మద్దతుదారుగా ఉంటున్నారు. అయితే మచ్చా నాగేశ్వరరావు మాత్రం టీడీపీలోనే కొనసాగుతూ వచ్చారు. అయితే, తాజాగా తెలంగాణలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఇప్పుడు అధికారికంగా ఇద్దరు ఎమ్మెల్యేలు.. టీఆర్ఎస్ పార్టీలో చేరి.. టీడీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేస్తున్నట్టు స్పీకర్కు లేఖ ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ ప్రాతినిథ్యం ముగిసిపోయింది. తద్వారా తిరుపతి ఉప ఎన్నిక ఫలితాల కంటే ముందే చంద్రబాబుకు ఘోర అవమానం జరిగిందని అంటున్నారు.