Chandrababu: ఎట్టకేలకు ఏపి ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఇంటి నిర్మాణానికి చర్యలు చేపట్టారు. అయితే ఇందులో విశేషం ఏమిటంటే..గత కొంత కాలంగా అధికార వైసీపీ నేతలు చంద్రబాబుకు ఏపిలో సొంత ఇల్లు కూడా లేదంటూ విమర్శిస్తున్నారు. సుదీర్ఘ కాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత ఊళ్లో కూడా చంద్రబాబుకు ఇల్లులేదని, తండ్రీ తనయులు (చంద్రబాబు, లోకేష్) హైదరాబాద్ లో ఎక్కువ రోజులు ఉంటూ అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చి పోతున్నారనీ విమర్శలు చేస్తున్నారు. వీటికి తోడు కుప్పం మున్సిపాలిటీని సైతం కైవశం చేసుకుని చంద్రబాబుకు వైసీపీ ఛాలెంజ్ చేసింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Chandrababu: 2.10ఎకరాల స్థలంలో
రాబోయే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గాన్ని కైవశం చేసుకుంటామని వైసీపీ సవాల్ చేసింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతల నుండి వచ్చే విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు నియోజకవర్గంలో తన పట్టు సడలకుండా చేసుకునేందుకు చంద్రబాబు తన స్వగ్రామంలో ఇల్లు నిర్మించుకోవడానికి సిద్ధమైయ్యారు. ఈ క్రమంలో భాగంగా కుప్పం – పలమనేరు జాతీయ రహదారి సమీపంలో శాంతిపురం మండలం పరిదిలోని కడపల్లె, కనమలదొడ్డి గ్రామాల మధ్య శివపురం ఎదురుగా 2.10 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయంచుకున్నారు(ట). రీసెంట్ గా కుప్పం పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఆ స్థలం రిజిస్ట్రేషన్ పత్రాలపై సంతకాలు కూడా చేసినట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
Read more :AP BJP: ఏపి బీజేపీకి షాక్..ఆ మాజీ మంత్రి పార్టీకి రాజీనామా..ఎందుకంటే..?
జూన్ 5న ఇంటి నిర్మాణానికి భూమి పూజ?
ఈ నెల 29వ తేదీన స్థలానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయనున్నారుట. వచ్చే నెల 5వ తేదీన చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి కుప్పం వెళ్లి ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేస్తారని టాక్. ఇక్కడ చంద్రబాబు నివాసంతో పాటు పార్టీ సమావేశాలను నిర్వహించేందుకు గానూ ప్రత్యేకంగా కార్యాలయ భవనం కూడా నిర్మించనున్నట్లు సమాచారం. దీంతో తమ పార్టీ నేత నియోజకవర్గంలో ఇల్లు నిర్మించుకుంటే చూడాలన్న అభిమానుల కోరిక తీరబోతున్నది. చంద్రబాబు ఇంటి నిర్మాణంపై ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఇన్నాళ్లు రాష్ట్రంలో ఇల్లు నిర్మించుకోవాలన్న ఆలోచన చేయని చంద్రబాబు.. జగన్ మూడేళ్ల పాలన చూశారో లేదో సొంత నియోజకవర్గంలో చంద్రబాబు ఇల్లు నిర్మించుకుంటున్నారని జగన్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.