Chandrababu : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు , ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక సమస్యకు పరిష్కారం చూపారా? లేకపోతే కొత్త సమస్యను తెచ్చిపెట్టుకున్నారా? ఈ చర్చ ఇప్పుడు ఏపీ టీడీపీ నేతల్లో హాట్ టాపిక్. ఎందుకంటే.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేత పేరును ఖరారు అయింది కాబట్టి. ఈ ప్రక్రియ ఇప్పుడున్న రచ్చను మరింత పెంచుతుందని పలువురు భావిస్తున్నారు.
బెజవాడలో ఏం జరుగుతోంది?
మున్సిపల్ ఎన్నిల సమయంలో టీడీపీలో గ్రూప్ విభేదాలు బయటపడ్డాయి. సీనియర్ నేతలే నువ్వు ఎంత? అటే నువ్వెంత అంటూ బహిరంగ విమర్శలకు దిగారు. ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగి ఆయా నేతలను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే, ఈ వివాదం ఇప్పటికీ రగులుతోందని టాక్. ఇలాంటి సమయంలోనే మేయర్ అభ్యర్థిగా ఇద్దరు ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపించినా.. చివరకు కేశినేని శ్వేత వైపే అధిష్టానం మొగ్గు చూపింది. దీంతో ప్రత్యర్థి వర్గం ఏం చేయనుందనే ప్రశ్న వినిపిస్తోంది.
మేయర్ అభ్యర్థి ఏమంటున్నారంటే…
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా తన పేరు ఖరారు అయిన నేపథ్యంలో కేశినేని శ్వేత స్పందించారు. తనకు మేయర్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడుకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. బెజవాడని అభివృద్ధి చేయటానికి రాజకీయాల్లోకి వచ్చానని తెలిపిన కేశినేని శ్వేత అనుభవం లేకపోయినా తొలిసారి తనకు మేయర్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. గత రెండేళ్లుగా బెజవాడలో వైసీపీ ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించిన ఆమె.. ష్ట్ర ప్రభుత్వం సహకరించక పోయినా విజయవాడ నగరాన్ని వరల్డ్ క్లాస్ సిటీగా మార్చటానికి కృషి చేస్తాను.