Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో ఓ రోజంతా వార్తల్లో నిలవడమే కాకుండా ఉత్కంఠను సృష్టించారు. సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో రేణిగుంట ఎయిర్పోర్ట్కు చేరుకున్న వెంటనే పోలీసులు చంద్రబాబును అడ్డుకున్నారు.. మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు నోటీసులు ఇచ్చారు.. దీంతో.. ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. అక్కడే బైఠాయించారు. రాత్రంతా ఎయిర్పోర్ట్లోనే ఉండాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరిగింది. అయితే, హఠాత్తుగా ఆయన నిర్ణయం మార్చుకున్నారు.
ఐయామ్ ది ఫైర్…
మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు నోటీసులు ఇచ్చారు.. దీంతో.. ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. 9 గంటల పాటు అక్కడే బైఠాయించారు. తన పర్యటనను అడ్డుకోవడంపై జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేస్తానని చంద్రబాబు పట్టుబట్టగా అందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయితే, ప్రతిపక్ష నేతగా కలెక్టర్, ఎస్పీలను కూడా కలిసే అవకాశం లేదా? అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. జిల్లా కలెక్టర్ను కలిసేందుకు అనుమతి ఇచ్చేవరకు ఎయిర్ పోర్ట్లోనే ఉంటానని తేల్చిచెప్పారు. ఎయిర్పోర్ట్ నుంచి చంద్రబాబును బలవంతంగా తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు.
బాబు నిర్ణయం మారింది…
చివరికి ఎన్నికల అక్రమాల మీద విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు చంద్రబాబు తిరుగు పయనం అయ్యారు. రేణిగుంట ఎయిర్పోర్టు చేరుకున్న జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం.. చిత్తూరు ఎస్పీ సెంధిల్ కూమార్ చంద్రబాబును ఒప్పించే ప్రయత్నాలు చేయగా అవి ఫలించి ఆయన హైదరాబాద్ బయలు దేరారు.