YS Jagan : ఈ నెల 17వ తేదీ తేదీన ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిగే ఓ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. ఏపిలో మానవహక్కుల కమిషన్ను ఏర్పాటు చేయాలని ఎప్పటి నుండో వివిధ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 2019లోనే మానవహక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలని ఏపి హైకోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశించినా మానవహక్కుల కమిషన్ ఏర్పాటు చేయకపోవడం కోర్టు దిక్కరణ వ్యాజ్యం నడుస్తోంది. మానవహక్కుల కమిషన్ ను ఎప్పటిలోగా ఏర్పాటు చేస్తారంటూ ప్రభుత్వాన్ని ఏపి హైకోర్టు గత నెలలో కూడా ప్రశ్నించింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర మానవహక్కుల సంఘం చైర్మన్, సభ్యుల నియామకంపై ఈ నెల 17న అత్యున్నత స్థాయి కమిటీ భేటీ కానున్నది. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన సచివాలయంలో ఉన్నత స్థాయి కమిటీ సమావేశం ఏర్పాటు కానున్నది. మానవహక్కుల కమిషన్ చైర్ పర్సన్, సభ్యుల ఎంపిక కోసం జరిగే ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, మండలి చైర్మన్ షరీఫ్, స్పీకర్ తమ్మినేని సీతారాం, హోంమంత్రి మేకతోటి సుచరిత, మండలి విపక్ష నేత యనమల రామకృష్ణుడు పాల్గొననున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?