Chandra babu : దేశంలోనే సీనియర్ రాజకీయవేత్త అని ప్రకటించుకునే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు సెల్ఫ్ గోల్ చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. ఏపీలో పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ ప్రకటన సైడ్ ఎఫెక్ట్స్ కొనసాగుతున్నాయి. పరిషత్ ఎన్నికలకు బహిష్కరిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. టీడీపీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ ప్రకటించారు.
Chandra babu చంద్రన్న సెల్ఫ్ గోల్…
పార్టీ నిర్ణయంపై విలేకరుల సమావేశంలో చంద్రబాబు మీడియాకు వివరించారు. అక్రమాలు జరిగిన ఎన్నికలనే కొనసాగిస్తున్నారని SEC తీరును తప్పు పడుతూ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల బహిష్కరణ కఠిన నిర్ణయమే ఐనా తప్పలేదని చంద్రబాబు పేర్కొన్నారు. బలవంతపు, అక్రమ ఏకగ్రీవాలపై చర్యలు తీసుకోక పోవడాన్ని తప్పు పట్టిన చంద్రబాబు పొలిట్ బ్యూరోలో నిర్ణయం మేరకు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక ఎన్నికలు అప్రజాస్వామికంగా మారాయని బాబు ఆరోపించారు. కొత్త ఎస్ఈసీ వచ్చీ రాగానే పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారని ఆయన అన్నారు. ఇప్పుడు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఎన్నికలు జరుగుతున్నాయని విమర్శించారు. పరిషత్ ఎన్నికల తేదీలను మంత్రులు ముందే ఎలా చెబుతారని చంద్రబాబు ప్రశ్నించారు.
మీ నేతలే మాట వినట్లే బాబు….
పరిషత్ ఎన్నికలపై చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో తెలుగుదేశం పార్టీలోనే కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికలు బహిష్కరించాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుబట్టిన జ్యోతుల నెహ్రూ జగ్గంపేటలో కార్యకర్తలు, అభ్యర్థుల సమక్షంలో తన నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీ నిర్ణయంతో కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి.. నేను వారితో కలిసి ఉండాలి అనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. నాకు పార్టీలో పదవులు వద్దు.. కార్యకర్తలతో కలిసి.. కార్యకర్తగా ఉంటానంటూ ఈ సందర్భంగా వెల్లడించారు జ్యోతుల నెహ్రూ.. అయితే, ఇదే సమయంలో జగ్గంపేట నియోజకవర్గ ఇంఛార్జ్గానే కొనసాగుతానని ఆయన స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.