Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు కీలక సమావేశం నిర్వహించారు. అనుబంధ సంఘాల నేతలతో సమావేశమైయ్యారు. టీడీపీ అనుబంధ సంఘాలైన తెలుగు యువత, తెలుగు మహిళ, టీఎన్టీయూసీ వంటి విభాగాల నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం కొద్ది రోజులుగా చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి తరువాత అనుబంధ సంఘాలు పెద్దగా యాక్టివ్ గా లేకపోవడంతో చంద్రబాబు ఈ సంఘాలపై దృష్టి పెట్టారు. అనుబంధ సంఘాల్లో పదవులు తీసుకున్న వారిలో కొందరు పార్టీ కార్యాలయం చుట్టూ తిరగడం, కొందరు పత్రికా ప్రకటనలకు పరిమితం అవుతున్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం కోసం పని చేయడం లేదు. ఇవన్నీ గమనించిన చంద్రబాబు అనుబంధ సంఘాల పని తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read More: CM YS Jagan: అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశం..ప్రస్తుత పరిస్థితిలో ఇది తప్పేలా లేదు.
Chandrababu: ఎవరెవరు ఏమి పని చేస్తున్నారో మొత్తం తెలుసు
పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీలోని 20 అనుబంధ విభాగాల నేతలు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై మరింత దూకుడుగా పోరాటాలు చేయాలని చంద్రబాబు వారికి సూచించారు. ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాడకుండా పార్టీ కార్యాలయం చుట్టూ తిరిగితే ఉపయోగం లేదన్నారు. ఇప్పటి నుండి అనుబంధ సంఘాల పని తీరుపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని అన్నారు. ఎవరెవరు ఏమి పని చేస్తున్నారో తనకు మొత్తం తెలుసునని అన్నారు. పదవులు తీసుకుని క్రియాశీలకంగా వ్యవహరించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు చంద్రబాబు. కొంత మంది నేతలు పత్రికా ప్రకటనలకే పరిమితం అవుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు, మూడు విభాగాలు మినహా ఇతర అనుబంధ సంఘాలు ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నాయని అన్నారు. పార్టీ అనుబంధ విభాగాల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పించాలని ఆయా విభాగాల అధ్యక్షులకు చంద్రబాబు సూచించారు.
Read More: YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో సంచలన ఆరోపణలు చేసిన సజ్జల..