Chandrababu: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా హర్ట్ అయ్యారు. ఈ సందర్భంలో ఆయన కఠిన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎదురైనా అవమానాలకు ఆయన తీవ్ర మనస్థాపానికి గురైయ్యారు. ఇక ఈ అసెంబ్లీ లో అడుగు పెట్టను, ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అసెంబ్లీలోకి అడుగు పెడతానంటూ భీషన ప్రతిజ్ఞ చేసి సమావేశాలు నుండి నేడు వాకౌట్ చేశారు. అసెంబ్లీ సమావేశాలలో రెండవ రోజైన శుక్రవారం టీడీపీతో పాటు చంద్రబాబు పై మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ఘాటైన విమర్శలు చేశారు. ఓవైపు మంత్రి కొడాలి నాని… చంద్రబాబు ని ఉద్దేశించి లుచ్చా అంటూ సంబోధించడం, మరోవైపు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు తమదైన శైలిలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Chandrababu: కంట తడి పెట్టిన చంద్రబాబు
చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని అవమానించిన తోపాటు ఆయన కుటుంబంలోని మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రబాబు కంట తడి పెడుతూ భావోద్వేగంతో చంచల నిర్ణయాన్ని ప్రకటించారు. పెద్ద పెద్ద మహానాయకుడు తో పని చేశాను, జాతీయ స్థాయి లను నాయకులతో పని చేశాను కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎన్నడూ చూడలేదు, గడిచిన రెండున్నరేళ్లలో అసెంబ్లీలో అనేక అవమానాలు చూశామని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా పార్టీపరంగా విమర్శలు చేస్తున్న అంతగా పట్టించుకోలేదు కానీ కుటుంబంలోని మహిళలను కించపరుస్తూ మాట్లాడటం గతంలో ఎప్పుడూ చూడలేదు అంటూ మళ్లీ సీఎం అయిన తర్వాతనే అసెంబ్లీలో అడుగు పెడతానంటూ చంద్రబాబు అసెంబ్లీ నుండి వాకౌట్ చేశారు.
ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీలను వైసిపి జెండా ఎగిరింది. దీనితో టిడిపిని, చంద్రబాబును టార్గెట్ చేస్తూ వైసిపి తీవ్రస్థాయిలో విమర్శలు గుర్తొస్తుంది. ఆయన రాజకీయ సన్యాసం తీసుకుని తట్టాబుట్టా సర్దుకుని హైదరాబాద్ వెళ్లిపోవాలంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.