YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి ఆశ్చర్యకరంగా ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సన్నిహితుడనే నేత మద్దతు తెలిపారు. ఏపీలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా సమయంలో విపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుండగా సదరు నేత ప్రభుత్వం నిర్ణయానికి జై కొట్టడం ఆసక్తికరంగా మారింద. అదే కరోనా టీకాలను ప్రైవేటు ఆస్పత్రులకు అందజేయడం ద్వారా బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుందని, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే టీకా ప్రక్రియ కొనసాగేలా చూడాలని ప్రధానికి సీఎం జగన్ లేఖ రాసిన ఎపిసోడ్.
ఏపీ సీఎం నిర్ణయానికి జై…
వ్యాక్సినేషన్ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి ప్రధానికి లేఖ రాయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సమర్థించారు. సీఎం నిర్ణయం సంతోషకరమని పేర్కొన్నారు. కరోనా రెండో దశ విస్తృతి ఎదుర్కోవడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. సీపీఐ తరఫున కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వానికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. కరోనా కట్టడిపై సీఎం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు.
టీడీపీ షాక్ తినడమేనా?
ఏపీ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయాలకు మద్దతు ఇచ్చే నేతగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ను పలువు పార్టీలు పేర్కొంటాయి. కొన్ని సందర్భాల్లో వైసీపీ ఈ మేరకు ఆరోపణలు చేసింది కూడా. అయితే, తాజాగా ఏపీ ముఖ్యమంత్రి నిర్ణయానికి సీపీఐ నేత మద్దతివ్వడం గమనార్హం. ఈ ఎపిసోడ్ సహజంగానే టీడీపీకి షాక్ ఇచ్చేదని పలువురు కామెంట్ చేస్తున్నారు.