Cheating: దేవాదాయ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని ఎప్పటి నుండో ఫిర్యాదులు ఉన్నాయి. ఏసీబీ అధికారులు తనిఖీలు చేసి అక్రమాలు బయటపెట్టే వరకూ ఆ శాఖ ఉన్నతాధికారులు స్పందించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక వేళ ఫిర్యాదులు వచ్చినా దిగువ స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుని అవినీతికి కారకులైన అధికారులను అక్కడ నుండి బదిలీలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. విజయవాడ కనకదుర్గ ఆలయంలో గత ఏడాది ఏసీబీ అధికారుల తనిఖీల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. దాంతో దాదాపు 15 మంది సిబ్బందికిపైగా సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఈవోపై బదిలీ వేటు వేశారు. చాలా ఆలయాల్లో అవినీతి జరుగుతున్నప్పటికీ సిబ్బంది మధ్య విబేదాలు, రాజకీయ కారణాల వల్ల కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయని అంటున్నారు.
Cheating: ద్వారకాతిరుమల ఇఓ జీవి సుబ్బారెడ్డిపై ఫిర్యాదు
తాజాగా ద్వారకాతిరుమల ఆలయంలో అధికారుల అవినీతిపై ఓ వ్యక్తి ఏకంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కే ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది. తన వద్ద ద్వారకా తిరుమల ఆలయ ఇఓ జీవి సుబ్బారెడ్డి కేశకంఢన శాలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.10 లక్షలు తీసుకున్నారని విజయవాడకు చెందిన సాంబశివరావు ఆరోపించారు. దీనిపై ఆయన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై మంత్రి వెల్లంపల్లి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
Read More: 1.TDP: టీడీపీలో జేసి బ్రదర్స్ పాత్ర ఏమిటి..? ఏ సీట్ల నుండి పోటీ చేయనున్నారు..?
3.YSRCP: జగన్ మళ్లీ అధికారంలోకి రాకపోతే.. కీలక నిర్ణయాన్ని ప్రకటించిన ఆ ఉప ముఖ్యమంత్రి..!!