Chiranjeevi: ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు చిరంజీవి హాట్ టాపిక్. క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న ఈ నేత ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ నేతల దృష్టిని ఆకర్షిస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి అయిన చిరంజీవి గురించి కాంగ్రెస్ నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. చిరంజీవి గురించి కాంగ్రెస్ సీనియర్ నేత ఉమెన్ చాందీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. చిరంజీవి కాంగ్రెస్ వాదేనని ఎఐసిసి, ఎపిసిసి స్పష్టం చేసింది.
Read More: congress: తెలంగాణ కాంగ్రెస్ … ఢిల్లీలో ఓ కామెడీ
చిరంజీవి గురించి…
చిరంజీవి కాంగ్రెస్ వాది కాదు అని కాంగ్రెస్ సీనియర్ నేత ఉమెన్ చాందీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి కాంగ్రెస్ వాదేనని శైలజానాథ్ పేర్కొన్నారు. చిరంజివి తనకిష్టమైన సినీ రంగంలో బిజీగా ఉండడం వల్లనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని ఏపీసీసీ వ్యవహారాల ఇన్ చార్జి ఉమెన్ చాందీ పేర్కొన్నారని వెల్లడించారు. కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు, పేదలకు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారని శైలజానాథ్ తెలిపారు. చిరంజీవి, ఆయన కుటుంబం మొదట నుంచి కాంగ్రెస్ వాదులు అని స్పష్టం చేశారు. చిరంజీవి కాంగ్రెస్ వాది కాదు అని వార్తలు రాయడం దారుణమని మండిపడ్డారు. భవిష్యత్తులో చిరంజీవి సేవలు పార్టీకి అందుతాయని, ఆయన క్రియాశీలకంగా పాల్గొనే అవకాశం ఉందని శైలజానాథ్ పేర్కొన్నారు.
Read More: KCR: కేసీఆర్ అవాక్కయ్యేలా చేస్తున్న కాంగ్రెస్
కాంగ్రెస్ దూకుడు పెంచుతోందా?
తెలుగు రాష్ట్రాల రాజకీయాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెంచిందా? అనే చర్చ జరుగుతోంది. ఓ వైపు తెలంగాణలో పీసీసీ నూతన కార్యవర్గం ప్రకటించడం , దూకుడుగా స్పందించే రేవంత్ రెడ్డికి పీసీసీ ఛీఫ్ ఇవ్వడం … ఇదే సమయంలో చిరంజీవి కాంగ్రెస్ వాది అని క్లారిటీ ఇవ్వడం చూస్తుంటే కాంగ్రెస్ కావాలనే వార్తల్లో నిలిచేందుకు ప్రణాళిక రచిస్తోందని అంటున్నారు.