EX Minister Narayana: మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు పిటిషన్ పై చిత్తూరు కోర్టు నేడు విచారణ జరిపింది. టెన్త్ క్లాస్ పరీక్షా పేపర్ల లీకేజీ వ్యవహారంలో ఈ నెల 10వ తేదీన చిత్తూరు పోలీసులు మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేసి కోర్టుకు హజరుపర్చగా 11వ తేదీ తెల్లవారుజామున నాల్గవ అదనపు జడ్జి బెయిల్ మంజూరూ చేసిన సంగతి తెలిసిందే. పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంలో నారాయణ పాత్ర ఉందనీ, ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం నేడు చిత్తూరు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
EX Minister Narayana: ఈ నెల 24 వతేదీ విచారణ
ప్రభుత్వం తరపున అడిషనల్ ఏజి పొన్నవోలు సుధాకర్ రెడ్డి వినిపించారు. నారాయణకు దిగువ కోర్టు మంజూరు చేసిన బెయిల్ చట్ట విరుద్దమన్నారు. సెక్షన్ 435, 437, సెక్షన్ 18 సీఆర్పీసీ కింద నమోదు అయిన కేసులో సొంత పూచికత్తుపై కోర్టు బెయిల్ మంజూరు చేయడం న్యాయబద్దంగా లేదని చెప్పారు. నారాయణ విద్యాసంస్థలకు చైర్మన్ గా లేరు అన్న కారణంతోనే బెయిల్ ఇచ్చారనీ, కుట్ర పన్నడానికి చైర్మన్ పదవి అవసరం లేదనీ, ఈ కేసులో ముద్దాయిలు ఇచ్చిన పత్రంలోనే నారాయణ పాత్ర చాలా స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. దీనిపై నారాయణకు కోర్టు నోటీసులు జారీ చేస్తూ.. కేసు విచారణను ఈ 24వ తేదీకి వాయిదా వేసింది.