జెస్సి ప్రశాంతి… 2018 బ్యాచ్ గ్రూప్ 1 స్టేట్ 3 ర్యాంకు వచ్చిన టాపర్… అనుకుంటే ఆర్డీఓ స్థాయి ర్యాంకు ఉద్యోగం వచ్చేది… కానీ చిన్నప్పటి నుంచి ఇంట్లో తండ్రి పోలీస్ డ్రెస్ ను చూసి మురిసిపోయిన గుర్తులు ఆమెను వెంటాడాయి… నాన్న పోలీసు ఉద్యోగంలో చూపించే తెగువ ఆమెను పోలీసు ఉద్యోగానికి వెళ్ళమని చెప్పింది… ప్రజల కోసం నిరంతరం నాన్న పడే శ్రమ చేస్తే ఎప్పటికైనా పోలీసు ఉద్యోగం చేయాలనే దృఢ సంకల్పాన్ని కలిగించింది… కష్టపడింది… చదువుతూనే పోలీసు ఉద్యోగం పై మమకారాన్ని పెంచుకుంది… చివరకు 2018 గ్రూపు 1 రాష్ట్రస్థాయి మూడో ర్యాంకు సాధించింది. తండ్రి ఎంత చెప్తున్నా ఆర్డీవో ఉద్యోగం తాను వెళ్లానని డిఎస్పీ ఉద్యోగానికి వెళ్తారని మొండిపట్టు పట్టి అనుకున్నది సాధించింది.. నాన్న శ్యాం సుందర్ అప్పటికి తిరుపతి లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తూనే ఆమెను డిఎస్పీ ఉద్యోగానికి దగ్గురుంది పంపారు శ్యాం సుందర్…
కట్ చేస్తే…
తిరుపతిలోని ఎంఆర్ పల్లి గ్రౌండ్లో… విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీస్ డ్యూటీ మీట్ అట్టహాసంగా జరుగుతోంది.. అక్కడకు రాష్ట్ర పోలీసు అధికారులు అందరూ వచ్చారు… అందరితోపాటు జెసి ప్రశాంతి సైతం డ్యూటీ మీట్ కు హాజరయ్యారు… ఆమె ఏదో పనిలో ఉండగానే సీరియస్ గా వచ్చిన ఓ సిఐ సెల్యూట్ మేడం అంటూ సీరియస్ గా స్టిఫ్ గా ఆమెకు సెల్యూట్ చేశారు… ఆమె సెల్యూట్ పెడుతూనే ఏంటిది నాన్న అంటూ… ఆయన గుండెల మీద వాలిపోయింది… ఆమె జెస్సి ప్రశాంతి అయితే.. సెల్యూట్ చేసింది ఆమె తండ్రి సీఐ శ్యాంసుందర్… తన కన్న పై స్థాయికి ఎదిగిన కూతురుకు… ఎంతో వినమ్రంగా చేసిన సెల్యూట్ అందరినీ ఆకట్టుకుంది…