Raghavendra Rao: రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో టీడీపీ (TDP) ఘోర పరాజయం తరువాత ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది. వరుసగా నేతలపై కేసులు నమోదు చేస్తూ అరెస్టులు చేయడంతో చాలా మంది నేతలు సైలెంట్ అయిపోయారు. అధికార పార్టీ ధీటుగా కార్యకర్తలు పని చేసే పరిస్థితి కొరవడింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో స్థానిక సంస్థలు, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో (Local Body Elections) గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయారు. అయితే ఇటీవల ఒంగోలులో మహానాడు (Mahanadu) విజయవంతం అయిన తరువాత ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వచ్చింది. తాజాగా ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్ర రావు చేసిన కామెంట్స్ తెలుగుతమ్ముళ్లలో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
రాష్ట్రంలో టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సావాల్లో భాగంగా తెనాలిలో 360 రోజుుల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మరో పక్క బాపట్ల జిల్లా చుండూరు మండలం నడిగడ్డపాలెంలో అభిమానులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ రోజురోజుకు తెలుగు దేశం పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందన్నారు.
రెండేళ్లలో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని రాఘవేంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారం చేపట్టడం తథ్యమని ఘంటాపథంగా చెప్పారు రాఘవేంద్రరావు. కార్యకర్తలు ఇదే ఉత్సాహం కొనసాగించాలని కోరారు. ఎన్టీఆర్ దార్శనికుడనీ, నేటి తరం నాయకులు ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. ఎన్నో హిట్ చిత్రాలను ప్రజలకు అందించిన దర్శకుడు రాఘవేంద్రరావు టీడీపీ ఆవిర్భావం నుండి ఆ పార్టీకి అనుబంధంగా, అభిమానిగా ఉన్న సంగతి తెలిసిందే.