RGV: సంచలన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తుంటారు అనేది అందరికీ తెలిసిందే. తాజాగా మరో సారి వార్తల్లోకి ఎక్కారు రామ్ గోపాల్ వర్మ. ఆర్జీవీ ఇవేళ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డితో భేటీ కావడం ఇటు రాజకీయ వర్గాల్లో అటు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఆయన సీఎం క్యాంప్ కార్యాలయంలో కాకుండా నేరుగా సీఎం జగన్ నివాసంలో సమావేశమైయ్యారు. జగన్ తో దాదాపు 40 నిమిషాలకు పైగా చర్చలు జరిపినట్లు తెలుస్తొంది. అనంతరం సీఎం జగన్ తో కలిసి వర్మ అక్కడే మద్యాహ్నం భోజనం చేశారుట.
అయితే ఆర్జీవీ సీఎం జగన్ తో సమావేశం కావడం ఇదేమి ప్రధమం కాదు. గతంలో సినిమా టికెట్ల వివాదంలోనూ ఆర్జీవీ స్పందించారు. నాటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి ప్రశ్నలు సంధిస్తూ ట్వీట్ లు చేయడం, ఆ తర్వాత మంత్రి నివాసానికి వెళ్లి చర్చలు జరపడం, సీఎం జగన్ తో మాట్లాడటం తెలిసిందే. అయితే అప్పుడంతా మొత్తం బహిర్గతంగానే మీడియాకు తెలియజేశారు. అయితే నేడు జగన్ తో వర్మ భేటీ అంశంపై అటు సీఎం కార్యాలయం గానీ వెల్లడించలేదు. ఆర్జీవీ కూడా ట్విట్టర్ వేదికగా వెల్లడించలేదు. దీంతో ఈ రహస్య భేటీ వెనుక ఆంతర్యం ఏమిటి అన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
తాాజా రాజకీయ పరిణామాల పై వారి మధ్య చర్చ జరిగిందా లేక రాజకీయ నేపథ్యంలో తను తీయబోయే మువీ గురించి మాట్లాడారా అనేది తెలియరాలేదు. సీఎం క్యాంప్ కార్యాలయం నుండి ఎలాంటి అధికార ప్రకటన దీనిపై లేకపోవడంతో వీరి భేటీ పూర్తిగా వర్మ వ్యక్తిగత విషయంగా తెలుస్తొంది. ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకునే వర్మ … సీఎం జగన్ తో కలిసిన విషయంపై ట్వీట్ చేయకపోవడం గమనార్హం. దీంతో రకరకాలుగా కామెంట్స్ వినబడుతున్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?