Pawan Kalyan: తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొద్ది రోజులుగా తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. సినిమా హాళ్ల టికెట్ల విక్రయంలో ఆన్ లైన్ విధానం తీసుకువచ్చే అంశంపై ఏపి సర్కార్, వర్సెస్ పవన్ కల్యాణ్ గా వివాదం చెలరేగుతోంది. ఏపి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంపై టాలీవుడ్ పెద్దలు అందరూ కలిసి ఏపి ప్రభుత్వంపై పోరాటం చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ పిలుపు ఇచ్చారు. సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మువీ ప్రీరిలీజ్ ఫంక్షన్ నందు పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమ అంశంపై మాట్లాడుతూ ఏపి ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్న సమయంలో టాలీవుడ్ పెద్దలు ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయకపోగా చప్పట్లు కొడుతూ ఆయన ప్రసంగాన్ని మెచ్చుకున్నారు. దీనిపై ఏపి మంత్రులు పేర్ని నాని వెల్లంపల్లి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పవన్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇదే క్రమంలో నటుడు పోసాని కృష్ణమురళి కూడా తీవ్రంగా స్పందించి పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు. దీనిపై పవన్ అభిమానులు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Pawan Kalyan: మొన్న మంత్రి నానితో నిర్మాతలు భేటీ
ఈ వ్యవహారం జరగుతున్న క్రమంలోనే టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాతలు హుటాహుటిన మచిలీపట్నం చేరుకుని ఏపి మంత్రి పేర్ని భేటీతో భేటీ అవ్వడం, పవన్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని చెప్పుకురావడం జరిగింది. పవన్ వ్యాఖ్యలపై చిరంజీవి కూడా విచారం వ్యక్తం చేశారని మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించడం జరిగింది. సినీ పరిశ్రమల సమస్యల పరిష్కారంలో ఏపి ప్రభుత్వం సానుకూలంగా ఉందంటూ కూడా వీరు పేర్కొన్నారు. ఈ సమస్యను రాజకీయం చేయవద్దంటూ కూడా విజ్ఞప్తి చేశారు నిర్మాతలు. అయితే ఈ వ్యవహారంలో సినీ పరిశ్రమ నుండి పవన్ కు మద్దతు కొరవడంతో ఏకాకి అయ్యారని వార్తలు వచ్చాయి.
Pawan Kalyan: పవన్ తో భేటీ అయిన అగ్ర నిర్మాతలు
ఈ తరుణంలో నిర్మాతలు దిల్ రాజు, దానయ్య, నవీన్ ఎర్నేని, వంశీరెడ్డి, నారంగ్, బన్నీ వాసులు శుక్రవారం హైదరాబాద్ లో పవన్ నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యల గురించి వీరు చర్చించారు. వారి మధ్య సృహృద్బావ వాతావరణంలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. రాజకీయాల్లోకి చిత్ర పరిశ్రమను అస్సలు లాగొద్దని పవన్ కళ్యాణ్ ను నిర్మాతలు కోరినట్లు సమాచారం. దీనిపై పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాల క్రమంలో ఈ వివాదానికి తెరపడినట్లే భావిస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?