టీడీపీ అధినేత చంద్రబాబు డిసెంబర్ 1వ తేదీన తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. చంద్రబాబు పర్యటన విజయవంతం చేసేందుకు గానూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి నేతృత్వంలో శనివారం సన్నాహాక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం సందర్భంలో టీడీపీ వర్గ విభేదాలు మరో సారి బయటపడ్డాయి. సమావేశంలో రసాభాస చోటుచేసుకోవడంతో అర్ధాంతరంగా ముగించారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో ఇద్దరు కమిటీ సభ్యులు సుబ్బరాయ చౌదరి, రామకృష్ణ సమావేశం ఏర్పాటు చేశారు.
అయితే సభా వేదికపై వచ్చే వారి జాబితాలో జవహార్ పేరు లేకపోవడంతో ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జవహర్ ను వేదిక పైకి పిలవాలంటూ ఆయన అనుకూల వర్గీయులు డిమాండ్ చేశారు. ఈ తరుణంలో జవహర్ అనుకూల, వ్యతిరేక వర్గీయుల మధ్య ఘర్షణ, తోపులాట జరిగింది. దీంతో బుచ్చయ్య చౌదరి నేతల తీరుపై తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తొంది. ఈ నియోజకవర్గంలో జవహర్ వచ్చిన ప్రతిసారీ ఆయన వ్యతిరేక వర్గం అడ్డుకుంటోందని సమాచారం. సన్నాహక సమావేశం రసాభాసగా మారడంతో నేతలు అర్ధాంతరంగా ముగించి వెళ్లిపోయినట్లు తెలుస్తొంది. అసలే ఓ పక్క చంద్రబాబు పర్యటనలో వైసీపీ నుండి నిరసనలు వ్యక్తం అవుతున్న తరుణంలో సొంత పార్టీలోనే గ్రూపు విభేదాలు బయటపడటం పార్టీకి తలనొప్పిగా మారిందని అంటున్నారు.
ఏపి సీఎస్ రేసులో అనూహ్యంగా కొత్త పేరు ..! సీఎం జగన్ తో ఆ కేంద్ర అధికారి భేటీ అందుకేనా..!?