CM Jagan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. రెండోరోజు సమావేశాలలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట్లాడుతూ… రాజకీయ వ్యవస్థలో చాలా సంస్కరణలు తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు. మేనిఫెస్టో పవిత్ర గ్రంథం గా భావించి హామీలను నెరవేర్చినట్లు చెప్పుకొచ్చారు. పారిశ్రామిక రంగం ఎంత ముఖ్యమో వ్యవసాయ రంగం కూడా తనుకు అంతే ముఖ్యమని తెలియజేశారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎంత ముఖ్యమో అవ్వదాతలు కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. కులం, మతం, ప్రాంతం పార్టీని చూడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని సీఎం జగన్ తెలిపారు.
ఇంకా అనేక విషయాల గురించి తెలియజేస్తూ పెన్షనర్లకు సీఎం జగన్ గుడ్ న్యూస్ తెలిపారు. వచ్చే జనవరి నెల నుంచి … పెన్షన్ డబ్బులు పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ₹2750 ఉన్న పెన్షన్ అమౌంట్… వచ్చే జనవరి నెల నుంచి ₹3000 రూపాయలు అందించనున్నట్లు ప్రకటన చేయడం జరిగింది. 2019 ఎన్నికల సమయంలో పెన్షన్ పెంచుకుంటూ పోతానని జగన్ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలకు చెప్పినట్టుగానే… పెన్షన్ విషయంలో ప్రతి ఏడాది పెంచుకుంటూ వైసిపి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. లంచాలకు తావు లేకుండా డిబిటి ద్వారా నేరుగా లబ్ధిదారులకు మేలు చేకూరే రీతిలో ప్రభుత్వం పని చేస్తున్నట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు.
ఇప్పటివరకు డిబీటీ ద్వారా ₹1,97,473 కోట్లు లబ్ధిదారులకు అందించినట్లు పేర్కొన్నారు. సచివాలయాల ద్వారా దాదాపు 600 సేవలు అందుతున్నాయి. రాష్ట్రంలో జిల్లాల పెంపుతో సేవలు మరింత చేరువయ్యాయి అని స్పష్టం చేశారు. ఆర్ బి కే ల ద్వారా గ్రామస్థాయిలో గొప్ప మార్పులు తీసుకురావడం జరిగిందని తెలిపారు. వ్యవసాయానికి పగటిపూటే ఉచిత కరెంటు ఇస్తున్నట్లు తెలిపారు. ఏ గ్రామానికి వెళ్లిన స్పష్టంగా మార్పు కనిపిస్తోంది. గ్రామస్థాయిలో గొప్ప అభివృద్ధిని చూపించగలిగామని సీఎం జగన్ తనదైన శైలిలో అసెంబ్లీలో ప్రసంగించారు.