CM Jagan Odisha Tour: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి భేటీ ముగిసింది. నేటి సాయంత్రం భువనేశ్వర్ వెళ్ళిన సీఎం జగన్ ఒడిశా సచివాలయంలో సీఎం నవీన్ పట్నాయక్ తో సమావేశమైయ్యారు. మూడు ప్రధాన అంశాలపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో ఏపి సీఎం జగన్ చర్చించారు. ఈ సందర్భంగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి జాయింట్ కమిటీ వేయాలని నిర్ణయించారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల (సీఎస్)తో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఒడిశా అభ్యంతరాలతో అనేక దశాబ్దాలుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు.
Read More: Chandra Babu: వైసీపీ సర్కార్ పై సీరియస్ కామెంట్స్ చేసిన చంద్రబాబు..!!
CM Jagan Odisha Tour: కీలక అంశాలపై చర్చ
వంశధార నదిపై నేరేడి బ్యారేజీ నిర్మాణం, జంఝువతి ప్రాజెక్టు నిర్మాణంపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో ఏపి సీఎం జగన్ చర్చించారు. అదే విధంగా పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల సమస్యపైనా చర్చించారు. బహుదానది నీటి విడుదల పై కూడా ముఖ్యమంత్రులు చర్చించారు. ఇంధన రంగంలో బలిమెల, ఎగువ సీలేరు కోసం ఎన్ఓసీ, యూనివర్శిటీల్లో ఒడిశా, తెలుగు భాషాభివృద్దికి కృషి, తీవ్రవాదం, గంజాయి నియంత్రణకు రెండు రాష్ట్రాలు కలిసి పని చేయాలని నిర్ణయించారు.
Read More: Chandra Babu: కుప్పంలో చంద్రబాబుకు షాక్ ఇచ్చిన పెద్దిరెడ్డి ..! ఎస్ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు..!!
ఈ భేటీలో సీఎం జగన్ తో పాటు డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాస్, ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉపారాణి పాల్గొన్నారు. కాగా ఏపి సీఎం జగన్మోహనరెడ్డికి అక్కడి సచివాలయంలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కు ఏపి సీఎం జగన్.. శ్రీవెంకటేశ్వరస్వామి వారి మెమెంటోను అందజేశారు.