దివంగత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి 73వ జయంతి సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ రోజు ఉదయం ఇడుపులపాయకు చేరుకుని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేసి నివాళులర్పించారు. అలాగే విజయమ్మ, వైఎస్ షర్మిల ఇతర కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ ఘట్ వద్ద నివాళులర్పించి ప్రార్ధనలో పాల్గొన్నారు. మరో పక్క రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నేతలు, కార్యకర్తలు నివాళులర్పిస్తున్నారు. కాగా సీఎం జగన్ ఇడుపులపాయ నుండి గన్నవరం బయలు దేరారు. మరి కొద్ది సేపటిలో గన్నవరం నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి ఎఎన్యూ వద్ద వైఎస్ఆర్ ప్లీనరీ ప్రాంగణానికి చేరుకుంటారు.
కాగా రెండు రోజుల పాటు జరిగే వైసీపీ ప్లీనరీ సమావేశాలు కొద్ది సేపటిలో ప్రారంభం కానున్నాయి, పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ సమావేశాలను ప్రారంభిస్తారు. ప్లీనరీ వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ వేదికకు వైఎస్ఆర్ ప్రాంగణంగా నామకరం చేశారు.