ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రేపు (బుధవారం) శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ పర్యటనలో సంతబొమ్మాళి మండలం మూలపేటలో పోర్టు నిర్మాణ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం భావనపాడు గ్రీన్ ఫీల్డ్ పోర్టు కు మూలపేట పోర్టుగా పేరు మార్పు చేసింది. ములపేట, విష్ణుచక్రం గ్రామాల రైతులు ప్రతిపాదిత పోర్టు ప్రాంతంలో భావనపాడు గ్రామం పరిధి లేదనీ, ములపేటలోని అన్ని భూములను పరిగణలోకి తీసుకుని పేరు మార్చాలని కోరడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు (ఓడ రేవులు) స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికల్ వలవెన్ తెలిపారు.
మొత్తం భూమి, ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలు మూలపేట, విష్ణుచక్రం గ్రామాలకు చెందినవనీ, భావనపాడు గ్రామానికి కాదని అక్కడి ప్రజలు తెలియజేశారు. స్థానిక ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భావన పాడు పోర్టుకు మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టుగా పేరు మార్చాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ప్రతిపాదనలు చేశారని వలవెన్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి చర్చల కమిటీ సమావేశాల్లో రైతులు ఈ ఆందోళనలు చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అదే పరిమితులతో భావనపాడు పోర్టును మూలపేట పోర్టుగా నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు అవసరమైన సవరణలు చేయాలని ఏపి మారిటైమ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ మరియు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. పోర్టు పేరు మార్పు అంశంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గ్రామస్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ నేత, బీటెక్ రవికి బిగ్ షాక్ .. ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియడంతో ..
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?