గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ రేపు (జూలై 15) మధ్యాహ్నం ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి వరదలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సీఎం జగన్ ఆదేశించారు. ఈ రోజు జలవనరుల శాఖ సమీక్ష సందర్భంగా వరద ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్దంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. వరద పరిస్థితిపై సీఎం జగన్ ఎప్పటికప్పుడు అధికారుల నుండి వివరాలు తెలుసుకుంటున్నారు.
రాబోయే 48 గంటల్లో వరద నీరు ఇంకా పోటెత్తే అవకాశం ఉందని సమీక్షా సమావేశంలో సీఎం జగన్ కు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతం నుండి వరద ప్రవాహం ఇంకా అధికం అయ్యే అవకాశాలు ఉన్నందున ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వారికి తగిన సౌకర్యాలు కల్పిస్తూ సహాయక శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆధికారులను ఆదేశించారు సీఎం జగన్.
భారీ వర్షాలు, వరదలపై సీఎం జగన్ సమీక్ష .. కీలక ఆదేశాలు జారీ