CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తన విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్నారు. తన కుమార్తె హర్ష గ్రాడ్యుయేషన్ కన్వొకేషన్ వేడుకల్లో పాల్గొనేందుకు గత నెల 28న పారిస్ కు భార్య భారతితో కలిసి వెళ్లిన సీఎం జగన్.. అక్కడ కార్యక్రమం ముగిసిన తరువాత నిన్న సాయంత్రం 4 గంటలకు బయలుదేరారు. ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్మోహనరెడ్డికి గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, జిల్లా అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం జగన్ తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కాగా రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భీమవరం పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. రేపు ఉదయం ప్రదాని మోడీ హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకోనున్నారు. అక్కడ నుండి బీమవరం వెళ్తారు. ప్రధాన మంత్రి మోడీకి స్వాగతం పలకడంతో పాటు కార్యక్రమాలు ముగిసే వరకూ సీఎం జగన్ ఆయనతోనే ఉండనున్నారు.